Chandrababu: నెల్లూరులో గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నారని.. నెల్లూరులో గల్లీ.. గల్లీ తిరిగిన వ్యక్తని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కు నెల్లూరులో అంతా తెలుసు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడుతుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. ప్రజలకు బంగారు భవిష్యత్ చూపించడం మా బాధ్యత. సింహపురిలో ప్రజా స్పందన అనూషంగా ఉంది రాష్ట్రమంతా ఇలానే ఉంది. 25 కు 24 లేదా 25 లోక్ సభ సీట్లు.. 160 అసెంబ్లీ సీట్లలో గెలుస్తున్నాం. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల గెలుపు ఓటములకు సంబంధించినది కాదు తెలుగు..జాతికి సంబంధించినది. రాతియుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి. రేపటి నుంచి పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి. ఉద్యోగస్తులంతా తమ వైపు ఉండాలి. రెండో సంతకాన్ని జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం పెడతా. నెల్లూరులో ముస్లింలు తరలి రావడం అభినందనీయం.”
READ MORE: KTR Road Show: సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్కు 60 వేల మెజార్టీ ఇవ్వాలి..
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎవరికీ అన్యాయం జరగలేదని చంద్రబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ముస్లిమ్స్ కు నాలుగు శాతం రిజర్వేషన్లను కాపాడుతాం. మక్కాకు వెళ్లే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాం. మౌజాం..ఇమామ్ లకు 5 వేల మేర గౌరవేతనమిస్తాం. రాష్ట్రంలో ఓట్లు చీలకుండా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే ప్రజల కోసం సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. టీడీపీ అధికారంలోకి వస్తే సంపద ను సృష్టించి మరింత మెరుగైన సంక్షేమాన్ని ఇస్తాం. ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందల చొప్పున ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలను ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేవరకూ రూ.3 వేల మేర నిరుద్యోగ భృతిని ఇస్తాం. పింఛన్ ను రూ.4 వేల రూపాయలకు పెంచుతాం. దివ్యాంగులకు రూ. 6 వేలకు పింఛన్ ను పెంచుతా. కాపుల సంక్షేమానికి బడ్జెట్లో రూ. 15000 కోట్లను టీడీపీ పెట్టింది. స్కిల్ సెన్సస్ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ను సినిమాలో నటించేందుకు శిక్షణ కోసం చిరంజీవి పంపించారు. విద్యారంగంలో ఒక బ్రాండ్ ను నారాయణ సృష్టించారు. వేమిరెడ్డికి ఎ2 విజయ్ సాయి రెడ్డికి ఏమైనా పోలిక ఉందా. జగన్ చూసిన అరాచకాలు చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చారు. నెల్లూరుకు విమానాశ్రయాన్ని తీసుకువస్తాం. నెల్లూరు వాళ్ళు ప్రపంచమంతా రాణిస్తున్నారు.”
- Tags
- AP Elections
- bjp
- cbn
- jagan
- janasena
తాజావార్తలు
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!