Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు , గ్రామీణ ప్రాంతాల వారికి ఎన్నో తీపి కబుర్లు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, సముద్ర రవాణాను మరింత సురక్షితం చేయడం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలకు ఈ సమావేశంలో పెద్దపీట వేశారు. రాజకీయంగా కూడా మహిళా సాధికారత అంశంపై ఈ భేటీలో చర్చ జరగడం విశేషం.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సెప్టెంబర్ చివరిలో రావాల్సిన ఈ ప్రకటన కొంత ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా రెండుసార్లు ప్రభుత్వం ఈ పెంపును చేపడుతుంది. సముద్ర రంగంలో భద్రత కోసం రూ. 13,000 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ను ఏర్పాటు చేయడం మరో ముఖ్యమైన నిర్ణయం.
Also Read
Also Read:Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
ఇది భారతీయ నౌకలకు తక్కువ ధరకే బీమా సౌకర్యం కల్పిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి అండగా నిలుస్తుంది. అదేవిధంగా.. గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రధాని గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగిస్తూ మరో రూ. 3,000 కోట్లు కేటాయించారు. చివరగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రధాని ఖండిస్తూ, మహిళల హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
-
CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
-
BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!