Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. దీంతో విమానం నుంచి దూకేస్తానని కూడా ఆ వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ తన యాజమాన్యానికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మంగళూరు విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also:NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
Also Read
ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ‘ప్రయాణికుల చర్యల కారణంగా ప్రయాణ సమయంలో సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విమానం సముద్రం మీదుగా వెళుతుండగా, ఆ ప్రయాణికుడు సముద్రంలో దూకుతానంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సదరు యువకుడు కేరళలోని కన్నూర్కు చెందిన ముహమ్మద్ బిసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మే 8న దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్లైట్ సమయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ నుండి దూకుతానని కూడా బెదిరించాడు. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
Read Also:Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
మంగుళూరులో విమానం దిగిన తర్వాత అతడిని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పట్టుకుని బజ్పే పోలీస్ స్టేషన్కు అప్పగించి, అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై బజ్పే పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 336 కింద కేసు నమోదైంది. ఇంతకు ముందు కూడా, విమానాలలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండిగోకి చెందిన షార్జా-అమృత్సర్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాజిందర్ సింగ్గా గుర్తించారు. ఎయిర్ హోస్టెస్తో రాజిందర్ సింగ్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితులు ఎయిర్ హోస్టెస్తో కూడా దురుసుగా ప్రవర్తించారు. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!