Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. దీంతో విమానం నుంచి దూకేస్తానని కూడా ఆ వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ తన యాజమాన్యానికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మంగళూరు విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also:NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ‘ప్రయాణికుల చర్యల కారణంగా ప్రయాణ సమయంలో సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విమానం సముద్రం మీదుగా వెళుతుండగా, ఆ ప్రయాణికుడు సముద్రంలో దూకుతానంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సదరు యువకుడు కేరళలోని కన్నూర్కు చెందిన ముహమ్మద్ బిసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మే 8న దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్లైట్ సమయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ నుండి దూకుతానని కూడా బెదిరించాడు. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
Read Also:Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
మంగుళూరులో విమానం దిగిన తర్వాత అతడిని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పట్టుకుని బజ్పే పోలీస్ స్టేషన్కు అప్పగించి, అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై బజ్పే పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 336 కింద కేసు నమోదైంది. ఇంతకు ముందు కూడా, విమానాలలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండిగోకి చెందిన షార్జా-అమృత్సర్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాజిందర్ సింగ్గా గుర్తించారు. ఎయిర్ హోస్టెస్తో రాజిందర్ సింగ్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితులు ఎయిర్ హోస్టెస్తో కూడా దురుసుగా ప్రవర్తించారు. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!