Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. దీంతో విమానం నుంచి దూకేస్తానని కూడా ఆ వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ తన యాజమాన్యానికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మంగళూరు విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also:NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ‘ప్రయాణికుల చర్యల కారణంగా ప్రయాణ సమయంలో సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విమానం సముద్రం మీదుగా వెళుతుండగా, ఆ ప్రయాణికుడు సముద్రంలో దూకుతానంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సదరు యువకుడు కేరళలోని కన్నూర్కు చెందిన ముహమ్మద్ బిసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మే 8న దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్లైట్ సమయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ నుండి దూకుతానని కూడా బెదిరించాడు. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
Read Also:Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
మంగుళూరులో విమానం దిగిన తర్వాత అతడిని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పట్టుకుని బజ్పే పోలీస్ స్టేషన్కు అప్పగించి, అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై బజ్పే పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 336 కింద కేసు నమోదైంది. ఇంతకు ముందు కూడా, విమానాలలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండిగోకి చెందిన షార్జా-అమృత్సర్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాజిందర్ సింగ్గా గుర్తించారు. ఎయిర్ హోస్టెస్తో రాజిందర్ సింగ్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితులు ఎయిర్ హోస్టెస్తో కూడా దురుసుగా ప్రవర్తించారు. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!