Air India : ఫ్లైట్ ఆపుతారా లేదంటే నన్ను దూకమంటారా.. విమానంలో ప్రయాణీకుల డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India : విమానాల్లో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇలాంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేశారు. దీంతో విమానం నుంచి దూకేస్తానని కూడా ఆ వ్యక్తి బెదిరించినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ తన యాజమాన్యానికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మంగళూరు విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Read Also:NBK 109: బాలయ్య బర్త్డే.. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్..
Also Read
ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, ‘ప్రయాణికుల చర్యల కారణంగా ప్రయాణ సమయంలో సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే విమానం సముద్రం మీదుగా వెళుతుండగా, ఆ ప్రయాణికుడు సముద్రంలో దూకుతానంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సదరు యువకుడు కేరళలోని కన్నూర్కు చెందిన ముహమ్మద్ బిసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మే 8న దుబాయ్ నుంచి మంగళూరుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఫ్లైట్ సమయంలో అతను చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్ నుండి దూకుతానని కూడా బెదిరించాడు. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
Read Also:Lok Sabha Elections 2024: ఈ ఎన్నికల్లో యంగ్ ఓటర్స్ ఎవరి వైపు..?
మంగుళూరులో విమానం దిగిన తర్వాత అతడిని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పట్టుకుని బజ్పే పోలీస్ స్టేషన్కు అప్పగించి, అవసరమైన చట్టపరమైన చర్యల కోసం అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిపై బజ్పే పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 336 కింద కేసు నమోదైంది. ఇంతకు ముందు కూడా, విమానాలలో సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇండిగోకి చెందిన షార్జా-అమృత్సర్ విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని రాజిందర్ సింగ్గా గుర్తించారు. ఎయిర్ హోస్టెస్తో రాజిందర్ సింగ్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో నిందితులు ఎయిర్ హోస్టెస్తో కూడా దురుసుగా ప్రవర్తించారు. అమృత్సర్లో దిగిన తర్వాత నిందితుడిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Bhojshala Case: భోజ్శాలలో నమాజ్కు అనుమతి లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
-
SIR గడువు పొడిగింపు.. ఈసీ సవరించిన షెడ్యూల్ విడుదల
-
YS Jagan: మత్స్యకారుల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ!
-
India vs England: రోహిత్, కోహ్లీ ఉన్నంత మాత్రాన గెలవలేం.. టీమిండియాను వేధిస్తున్న ఈ 4 కీలక ప్రశ్నలు!
-
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!