Paritala Sriram And Vangaveeti Radha: ఈ ఇద్దరి కలయిక ఏపీలో హాట్ టాపిక్ అవుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఏపీ రాజకీయాల్లో అమరావతి పాదయాత్ర, విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఇప్పుడు హాట్ టాపిక్ లు.. కానీ మరో అంశం తెరమీదకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ యువ నేతలు వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ రాజమహేంద్రవరం వేదికగా కలిశారన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ రాజకీయంగా వివిధ అంశాలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం రాత్రి ఈ ఇద్దరు యువ నేతలు రాజమహేంద్ర వరంలో భేటీ అయ్యారు. ఇదేం గాసిప్ కాదు.. స్వయంగా పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా దీనిని ప్రకటించారు. ఇద్దరూ చాలాసేపు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
Also Read

ఏపీలో వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరాం ఇద్దరు రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన కుటుంబాల నుంచి వచ్చారు. ఈ కుటుంబాలకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం రాజమహేద్రవరంలోకి ప్రవేశించనుంది. ఈ ఇరువురు నేతలు అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలపనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్లు మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్తో కలిసి సమావేశమయ్యారు.
గతంలో వంగవీటి రాధకు పరిటాల శ్రీరామ్ మద్ధతుగా నిలిచారు. రాధాపై రెక్కీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరామ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. రాధాను ఎవరైనా టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించాయి. టీడీపీ నేతలు కూడా రాధాకు సంఘీభావం తెలిపారు. స్వయంగా చంద్రబాబునాయుడే రాధాను పరామర్శించారు. రాధాకు మేం అండగా వుంటామంటూ భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో ఈ యంగ్ తరంగ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజమండ్రి నగరంలో వంగవీటి రాధా గారితో సమావేశమైన సందర్భంగా… pic.twitter.com/OoJlwLYt9l
— Paritala Sreeram (@IParitalaSriram) October 16, 2022
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్పై పీఎస్లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!