Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్కు నేడు ముగింపు.. భారత పతాకధారులుగా మను, శ్రీజేష్!
- ఒలింపిక్స్కు నేడే ముగింపు
- రాత్రి 12.30 గంటలకు ముగింపు కార్యక్రమం
- భారత్ ఖాతాలో 6 పతకాలు
Paris Olympics 2024 Closing Ceremony Today: గత 19 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రేమికులను అలరిస్తున్న పారిస్ ఒలింపిక్స్ నేడు ముగియనున్నాయి. జులై 26న అధికారికంగా క్రీడలు ఆరంభమవ్వగా.. ఆగష్టు 11తో ముగియనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 12.30 గంటలకు క్రీడల ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముగింపు వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, హాకీ దిగ్గజం పీఆర్ శ్రీజేష్ వ్యవహరించనున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024 చివరి రోజు అథ్లెటిక్స్ (మహిళల మారథాన్), బాస్కెట్బాల్, సైక్లింగ్ ట్రాక్, హ్యాండ్ బాల్, మోడర్న్ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్లో పోటీలు ఉన్నాయి. బాస్కెట్బాల్ అమ్మాయిల ఫైనల్తో విశ్వ క్రీడల పోటీలు ముగుస్తాయి. ఇక శనివారంతోనే భారత ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. భారత్ మొత్తం 6 పతకాలు గెలుచుకుంది.
Also Read
పారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమం స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత పాప్ గాయని, రచయిత హెచ్ఈఆర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నృత్యకారులు, సంగీత కళాకారులు తదితరులు తమ ప్రదర్శనలతో అలరించన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!