Property Issue: రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు.. గుంట భూమి కోసం కొడుకుని కొట్టి చంపిన తల్లిదండ్రులు
- రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు
- గుంట భూమి కోసం కొడుకుని కొట్టి చంపిన తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి నిరూపితమయ్యాయి. గుంట భూమి కోసం కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు. రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు. మానవ సంబంధాలను మంటగలిపేశారు. అతని స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులే కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో చోటుచేసుకుంది. మృతుడు తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అక్కడికి చేరుకున్నారని సమాచారం. వారు నిర్మాణానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి చివరికి వారు అతనిపై కర్రలతో దాడి చేశారు. మృతుడి భార్య తొమ్మిది నెలల గర్భవతి. గుంట భూమి కోసం తన భర్తను చంపారని ఆమె ఆరోపిస్తోంది.
Also Read:Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
Also Read
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బాబేరు కొత్వాలి ప్రాంతంలో జరిగింది. గౌరీ ఖాన్పూర్ నివాసి అయిన 24 ఏళ్ల రామ్ఖేలావన్ తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తమ్ముడు అభ్యంతరం వ్యక్తం చేశాడు, భూ పంపకాలపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అతని తల్లి, తండ్రి, సోదరి సంఘటన స్థలానికి వచ్చారు. ఈ క్రమంలోనే వివాదం పెరిగి రామ్ఖేలావన్ పై దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. మృతుడి భార్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!