Palla Srinivas: వైఎస్ జగన్ వల్లే ప్రాణ హాని.. బొత్సకు పల్లా కౌంటర్!
- బొత్స సత్యనారాయణకు పల్లా శ్రీనివాస్ కౌంటర్
- బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్ వల్ల ప్రాణ హాని
- ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాణ హాని ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలి ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణకు మాజీ సీఎం వైఎస్ జగన్ వల్ల ప్రాణ హాని ఉందన్నారు. ఇటీవల మండలిలో బొత్స పనితీరు బావుందని, ఇది జగన్కు నచ్చదు అన్నారు. గతంలో బాబాయ్కు జరిగినట్టే బొత్సకు కూడా జరగచ్చు అన్నారు పల్లా. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రాణ హాని ఉండదన్నారు. బొత్స తనకు ప్రాణ హాని ఉందని చెప్పడంతో పల్లా శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని బొత్స ఆరోపించారు. ఇటీవల జరిగిన పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీలపై మండిపడ్డారు.
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
‘అమ్మవారి పండగపై బొత్స సత్యనారాయణ అధికారులను నిందించడం సరికాదు. పండగ వైభవంగా జరిగింది. దీనిని సహించలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు రోజుల ముందు మాకు ఆయన షెడ్యూల్ ఇచ్చారు. స్టేజ్ వేసింది వాళ్ల మనుషులే.. స్టేజ్ చుట్టూ వాళ్లకి కావల్సిన కలర్ క్లాత్ లే కట్టుకున్నారు. ఇరవై అయిదు మందికి సరిపడా స్టేజ్ వేశాం. అయితే యాభై మంది స్టేజ్ పైకి వెళ్తే ఏమవుతుంది. పండగ రోజు వర్షం పడింది.స్టేజ్ కొద్దగానే ఒరిగింది.. ఏం కాలేదు. మాకు బొత్స సత్యనారాయణ అంటే గౌరవం ఉంది. సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్న నాయకుడు. ఇందులో ఎలాంటి కుట్రా లేదు. పండగకు హుండీ పెట్టామనడం సరికాదు.. స్వచ్ఛందంగా ఇచ్చిన వారి నుంచే తీసుకున్నాం. బలవంతపు వసూళ్లు లేవు’ అని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!