Suicide Attempt: మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం.. ఆస్తి పంచడం లేదని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Attempt: చిత్తూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో ఆస్తి వ్యవహారంపై వివాదం చెలరేగింది. తన అన్న ఆస్తి పంచడం లేదని ఆస్తిలో అన్న తనకు రావాల్సిన వాటా అన్న ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన సోమవారం పుంగనూరులో చోటుచేసుకుంది. గతంలో పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్న నంజప్పకు కుమారులు మునిరత్నం, శంకరప్ప, కుమార్తె పార్వతమ్మ ఉన్నారు. నంజప్ప మృతి తర్వాత ఆస్తి కోసం కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ముత్తుకూరు వద్ద తండ్రి సంపాదించిన 60 ఎకరాలు, పుంగనూరు పట్టణంలోని ఇళ్లు, స్థలాల్లో భాగం కావాలని తాము కోరుతున్నా వెంకటరత్నం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని శంకరప్ప ఆవేదన చెందారు. తాను మరణిస్తే తన బిడ్డలకైనా ఆస్తి ఇవ్వాలంటూ ఆయన ఇంట్లో తలుపులు వేసుకుని సోమవారం ఉదయం పెట్రోల్ పోసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి బాటిల్ లాక్కొని ఒంటిపై నీళ్లు పోశారు. ఈ ఘటన తర్వాత శంకరప్ప కుమారుడు నంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంజప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తదనంతరం ఉన్న ఆస్తుల విషయంలోనే కుమారుల మధ్య వివాదం నడుస్తోంది.
Read Also: AP CM Jagan: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సన్నాహక సమావేశాన్ని చేపట్టిన సీఎం జగన్
Also Read
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
పెద్దపంజాణి మండలం ముత్తుకూరు, పుంగనూరు పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే కుమారులకు భూములు ఉన్నాయి. అందులో పెద్ద కుమారుడు వెంకటరత్నం.. చిన్న కుమారుడు శంకరప్పకు రావాల్సిన భాగం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆస్తి విషయమై పెద్దమనుషుల్ని కూర్చోబెట్టి పంచాయతీల్లో తీర్మానం కూడా చేశారు. అయినా తమకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు శంకరప్ప చెబుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని.. ఆ ఆస్తుల వ్యవహారంపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. అక్కడికి వచ్చిన పోలీసులు.. వెంకటరత్నంను పిలిపించి న్యాయం చేస్తామని తెలిపారు. తాము చాలా పేదరికంలో జీవిస్తున్నామని, అప్పులు అధికంగా ఉండటంతో చెల్లించలేక చింతపండు పనులకు వెళుతున్నట్లు శంకరప్ప కుటుంబీకులు వాపోయారు. తమకు ఇప్పటికైనా అధికారులు న్యాయం చేసి తనకు రావాల్సిన వాటా ఇప్పించాలని వారు కోరారు.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!