Site icon NTV Telugu

Pakistan: భారత్‌పై మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్‌

Pakistan

Pakistan

Pakistan: దాదాది దేశమైన పాకిస్థాన్‌ భారత్‌పై ఎప్పుడూ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంటుంది. పాక్‌ మరోసారి భారత్‌పై విషం చిమ్మింది. పాకిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ భారత్‌పై విషం చిమ్మడంలో బిలావల్ భుట్టో జర్దారీని సమం చేయడం ప్రారంభించారు. పాకిస్థాన్ భారత్ పట్ల సానుకూలంగా చర్యలు తీసుకుంటుందని, అయితే ప్రతిసారీ భారత్ నుంచి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుందని జిలానీ ఆరోపించారు. భారత సిక్కు కమ్యూనిటీకి వీసా రహిత ప్రయాణానికి కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడం సహా పాకిస్థాన్ అనేక సానుకూల కార్యక్రమాలు, శాంతి ప్రయత్నాలను చేపట్టిందని, అయితే భారతదేశం సహకరించడం లేదని ఆయన బుధవారం అన్నారు. అన్వర్ ఉల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రభుత్వంలో జిలానీ తాత్కాలిక విదేశాంగ మంత్రి పాత్రను పోషిస్తున్నారు.

Also Read: Udayanidhi Stalin: సనాతన ధర్మం నాశనమైతేనే.. మరోసారి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూయార్క్‌లో జరిగిన ఆసియా సొసైటీ సదస్సులో పాక్ విదేశాంగ మంత్రి జిలానీ ప్రసంగిస్తూ.. భారత్‌తో శాంతియుత, సహకార పొరుగు సంబంధాలను పాకిస్థాన్ కోరుకుంటోందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ ‘చట్టవిరుద్ధ’ చర్య తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. కశ్మీర్‌లో భారత భద్రతా దళాల చేతుల్లో అమాయక కశ్మీరీలపై ‘మానవ హక్కుల ఉల్లంఘన’ జరుగుతోందని ఆయన అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయని జిలానీ పేర్కొన్నారు. తన మునుపటి విదేశాంగ మంత్రుల మాదిరిగానే, కాకర్ కూడా భారతదేశంపై ముస్లింలను ఆరోపించిన వేధింపులతో సహా నిరాధారమైన ఆరోపణలు చేశాడు. అయితే, పాకిస్తాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై జరిగిన కఠోర హింసపై ఆయన మౌనం వహించారు.

Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడు.. కలకలం రేపిన ట్రంప్‌ కుమారుడి పోస్ట్!

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్థాన్‌కు అత్యధిక వాటా ఉందని పాక్ విదేశాంగ మంత్రి జిలానీ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తాత్కాలిక ప్రభుత్వంతో పాకిస్థాన్‌కు నేరుగా సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. తాము ఆఫ్ఘనిస్తాన్‌పై అంతర్జాతీయ సమాజానికి సహకరించడానికి కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. దాదాపు 40 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులకు పాకిస్థాన్‌లో ఆతిథ్యం ఇస్తున్నామని, వీరు దాదాపు నాలుగు దశాబ్దాలుగా పాకిస్థాన్‌లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ శరణార్థులు తిరిగి తమ దేశానికి వెళ్లి.. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని జిలానీ పేర్కొన్నారు.

Exit mobile version