IND vs PAK: పాకిస్తాన్ గెలుస్తుంది.. ఐఐటీ బాబా జోస్యం
- సోషల్ మీడియాలో ఐఐటీ బాబా వీడియో వైరల్
- ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి అంచనా
- భారత జట్టు ఓడిపోతుందన్న ఐఐటీ బాబా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా కారణంగా చాలా మంది బాబాలు వెలుగులోకి వచ్చారు. ఇందులో ఐఐటీ బాబా అత్యధిక వార్తల్లో నిలిచాడు. ఐఐటీ ముంబైలో చదువుకున్న అభయ్ సింగ్ సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. అతను తన అభిమానులతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటాడు. కాగా.. సోషల్ మీడియాలో ఐఐటీ బాబాకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అతను ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ గురించి ఒక అంచనా వేశాడు. అతను భారత జట్టు ఓడిపోతుందని అన్నాడు. దీంతో.. టీమిండియా ఫ్యాన్సే కాకుండా.. పాకిస్తాన్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఐఐటీ బాబా ఆ వీడియోలో మాట్లాడుతూ, “ఈసారి భారత్ గెలవదని నేను మీకు ముందుగానే చెబుతున్నాను. విరాట్ కోహ్లీతో సహా భారత ఆటగాళ్ళు ఫలితాన్ని మార్చలేరు.” అని అన్నాడు. కాగా.. క్రికెట్ ఫ్యాన్స్ అతని వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు టీమిండియా పాకిస్తాన్ పై విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. మరోవైపు.. భారత జట్టు బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ క్రమంలో.. భారత్ జట్టు బలంగా ఉంది.
Read Also: Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 5వ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. టోర్నమెంట్ నిర్వహణ బాధ్యతను పాకిస్తాన్ కు అప్పగించారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్కు వెళ్లలేదు. దీంతో.. ఈ ఐసిసి ఈవెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు. కాగా.. భారత్తో మ్యాచ్ కోసం పాకిస్తాన్ దుబాయ్ వెళ్తుంది.
https://twitter.com/multiversehubs/status/1892394231190126634
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!