Pakistan : పాక్ లో భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 24మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ప్రతికూల వాతావరణం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ఖేల్ ప్రాంతంలోని ఇంటి బేస్ మెట్లో వర్షపు నీరు నిండిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. రెస్క్యూ టీం తెలిపిన వివరాల ప్రకారం.. వరదల్లో మునిగిపోయిన బేస్ మెట్లో కుటుంబంలోని 11 మంది సభ్యులు చిక్కుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. రెస్క్యూ అధికారులు మృతదేహాలను వైద్య , చట్టపరమైన లాంఛనాల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
రుతుపవనాల వర్షాలు జూలై 31 వరకు కొనసాగుతాయని అంచనా. వచ్చే 24 గంటల్లో పంజాబ్లోని చాలా జిల్లాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (PDMA) అంచనా వేసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కొనసాగుతున్న రుతుపవన వర్షాల మధ్య పంజాబ్లోని అన్ని నదులు, కాలువలు సాధారణ నీటి ప్రవాహాన్ని అనుభవిస్తున్నాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. డ్యామ్లు, బ్యారేజీల్లో నీటి ప్రవాహం నిలకడగా ఉందని పీడీఎంఏ ప్రతినిధి తెలిపారు. మంగళ డ్యామ్లో ప్రస్తుత నీటిమట్టం 58%, తర్బేలా డ్యామ్లో 69% ఉంది. సట్లెజ్, బియాస్, రావి నదులపై నిర్మించిన భారతీయ డ్యామ్లలో నీటి మట్టం 39%కి చేరుకుంది.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also:SL vs IND: రింకు, సూర్య సంచలన బౌలింగ్.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ విజయం!
పిడుగుపాటుకు పలువురు మృతి
పాకిస్థాన్లో సోమవారం పిడుగులు పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా ఎనిమిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పొలాల్లో ఉండగా పిడుగుపాటుకు గురై అందరూ మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు, బాలుడు, వృద్ధుడు మృతి చెందారు.
వర్షం కారణంగా కూలిన ఇంటి పైకప్పు
జిల్లాలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు 40 ఏళ్ల వ్యక్తి, 11 ఏళ్ల బాలిక మృతి చెందారు. ఇది కాకుండా, ఈ సంఘటనలలో 20 జంతువులు కూడా మరణించాయి. రావల్పిండిలో భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. అమర్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది. దీని కారణంగా తల్లి, కుమార్తె శిధిలాల కింద ఖననం అయ్యారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ టీమ్ చాలా శ్రమించి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. రెస్క్యూ టీమ్ మృతులను సమీప ఆసుపత్రికి తరలించి, వారి కుటుంబాలకు అప్పగించారు.
Read Also:Wayanad Landslides : వాయనాడ్లో ప్రకృతి విధ్వంసం… ఇప్పటివరకు 151 మంది మృతి
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!