Pakistan : పాక్ లో భారీ వర్షాలు.. ఇప్పటి వరకు 24మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్లో ప్రతికూల వాతావరణం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ఖేల్ ప్రాంతంలోని ఇంటి బేస్ మెట్లో వర్షపు నీరు నిండిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. రెస్క్యూ టీం తెలిపిన వివరాల ప్రకారం.. వరదల్లో మునిగిపోయిన బేస్ మెట్లో కుటుంబంలోని 11 మంది సభ్యులు చిక్కుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. రెస్క్యూ అధికారులు మృతదేహాలను వైద్య , చట్టపరమైన లాంఛనాల కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
రుతుపవనాల వర్షాలు జూలై 31 వరకు కొనసాగుతాయని అంచనా. వచ్చే 24 గంటల్లో పంజాబ్లోని చాలా జిల్లాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (PDMA) అంచనా వేసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కొనసాగుతున్న రుతుపవన వర్షాల మధ్య పంజాబ్లోని అన్ని నదులు, కాలువలు సాధారణ నీటి ప్రవాహాన్ని అనుభవిస్తున్నాయని ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. డ్యామ్లు, బ్యారేజీల్లో నీటి ప్రవాహం నిలకడగా ఉందని పీడీఎంఏ ప్రతినిధి తెలిపారు. మంగళ డ్యామ్లో ప్రస్తుత నీటిమట్టం 58%, తర్బేలా డ్యామ్లో 69% ఉంది. సట్లెజ్, బియాస్, రావి నదులపై నిర్మించిన భారతీయ డ్యామ్లలో నీటి మట్టం 39%కి చేరుకుంది.
Also Read
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
- Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
Read Also:SL vs IND: రింకు, సూర్య సంచలన బౌలింగ్.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై భారత్ విజయం!
పిడుగుపాటుకు పలువురు మృతి
పాకిస్థాన్లో సోమవారం పిడుగులు పడి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా ఎనిమిది మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పొలాల్లో ఉండగా పిడుగుపాటుకు గురై అందరూ మృతిచెందారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు, బాలుడు, వృద్ధుడు మృతి చెందారు.
వర్షం కారణంగా కూలిన ఇంటి పైకప్పు
జిల్లాలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు 40 ఏళ్ల వ్యక్తి, 11 ఏళ్ల బాలిక మృతి చెందారు. ఇది కాకుండా, ఈ సంఘటనలలో 20 జంతువులు కూడా మరణించాయి. రావల్పిండిలో భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి ఓ మహిళ, ఆమె కుమార్తె మృతి చెందారు. అమర్పూర్ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది. దీని కారణంగా తల్లి, కుమార్తె శిధిలాల కింద ఖననం అయ్యారు. స్థానికుల సహాయంతో రెస్క్యూ టీమ్ చాలా శ్రమించి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. రెస్క్యూ టీమ్ మృతులను సమీప ఆసుపత్రికి తరలించి, వారి కుటుంబాలకు అప్పగించారు.
Read Also:Wayanad Landslides : వాయనాడ్లో ప్రకృతి విధ్వంసం… ఇప్పటివరకు 151 మంది మృతి
తాజావార్తలు
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
-
Uber Layoffs: ఉబర్లో భారీ లేఆఫ్స్.. 3,300 మంది ఉద్యోగులకు షాక్! భారత్లో ప్రభావం ఎంత?
-
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!