Vikram Misri : పాకిస్థాన్ తప్పించుకోవాలని చూస్తోంది.. విదేశాంగ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ గురించి ఎంఈఏ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రసంగించారు.. పహల్గామ్పై దాడి రెచ్చగొట్టారు. అందుకే నిన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని మరోసారి స్పష్టం చేశారు. పహల్గామ్ దాడికి లష్కరేతో సంబంధం ఉన్న ఒక సంస్థ బాధ్యత వహించిందని.. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు ప్రస్తావించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంఘటన నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తోందన్నారు. పాకిస్థాన్ ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో అనేక ఉగ్రవాద దాడులు జరిగాయని.. ఇందులో పాకిస్థాన్ హస్తం ఉందని తేలినట్లు చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అతన్ని అమరవీరుడు అని ఎవరు పిలిచారు? అని ప్రశ్నించారు.
READ MORE: CM Revanth Reddy: హైడ్రా అంటే కూల్చడమే కాదు.. ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కూడా..!
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ దాడికి సంబంధించి ప్రపంచాన్ని పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిందని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ నిలయంగా మారిందని.. ఇందులో మసూద్ అజార్, హఫీజ్ మొహమ్మద్ సయీద్ ఉన్నారన్నారు. భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటోందని.. ఉగ్రవాదుల రహస్య స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని పునరుద్ఘాటించారు. “పాకిస్థాన్ పహల్గామ్ దాడిపై ఉమ్మడి దర్యాప్తు చేయాలని ప్రతిపాదన తెచ్చింది. మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ఇది ఒక వ్యూహం. 26/11, పఠాన్కోట్ వంటి దాడుల దర్యాప్తులో భారతదేశం సహకరించింది. కానీ పాకిస్థాన్ ఆ కేసులను పక్కన పెట్టింది. ముంబై దాడిపై వివరణాత్మక ఆధారాలు అందించినప్పటికీ.. ఎటువంటి ఖచ్చితమైన చర్య తీసుకోలేదు. పఠాన్కోట్ కేసులో డీఎన్ఏ విశ్లేషణ, ఉగ్రవాద సంస్థల అధికారుల సమాచారాన్ని పాకిస్థాన్ బృందానికి అందించాం. కానీ ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేదు.” అని మిస్రీ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..