Pakistan Debt Crisis: పేదరికంలో నయా రికార్డు..! పాకిస్థాన్ను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న షాబాజ్..
Pakistan Debt Crisis: దాయాది దేశం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాక్లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ పేదరికంలో కొత్త రికార్డును సృష్టిస్తోంది. షాబాద్ ప్రధాని అయ్యాక ఆ దేశం పరిస్థితి మరింత దిగజారింది. జూన్ 2025 నాటికి పాకిస్థాన్ మొత్తం ప్రజా రుణం US$286.832 బిలియన్లకు (సుమారు 80.6 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయలు) పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 13 శాతం పెరిగిందని అధికారిక డేటా వెల్లడించింది. తాజాగా పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 ఆర్థిక ఏడాది వార్షిక రుణ సమీక్ష ప్రకారం.. జూన్ 2025 చివరి నాటికి, పాకిస్థాన్ మొత్తం ప్రజా అప్పు రూ. 80.6 ట్రిలియన్లకు చేరుకుంది. ఇందులో దేశీయ అప్పు రూ. 54.5 ట్రిలియన్లు, బాహ్య అప్పు రూ. 26.0 ట్రిలియన్లు ఉన్నాయి.
READ MORE: Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
జూన్ 2024లో 68 శాతంతో పోలిస్తే, జూన్ 2025లో రుణం-జీడీపీ నిష్పత్తి దాదాపు 70 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ప్రధానంగా 2025లో ఊహించిన దానికంటే తక్కువ జీడీపీ వృద్ధి నమోదైందని.. దీని కారణంగా అప్పు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక విస్తరణ మందగించిందని తెలిపింది. దేశీయ అప్పులు గత ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగి 54.5 ట్రిలియన్ రూపాయలకు చేరుకున్నాయని, ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో అత్యల్ప వార్షిక పెరుగుదల అని నివేదిక పేర్కొంది. ఇంతలో బాహ్య అప్పులు జూన్ 2025 నాటికి 6 శాతం పెరిగి US$91.8 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది ప్రధానంగా IMF నుంచి నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) హామీ ఇచ్చిన $1 బిలియన్ వాణిజ్య రుణం, ఇతర బహుపాక్షిక సంస్థల నుంచి వచ్చే నిధుల కారణంగా జరిగింది.
READ MORE: Delhi official Logo: ఢిల్లీకి మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!