Delhi official Logo: ఢిల్లీకి మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi official Logo: ఢిల్లీ – పేరుకే దేశ రాజధాని, కానీ ఇప్పటివరకు ఢిల్లీకి ప్రత్యేకంగా చిహ్నం లేదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు తమ ప్రత్యేక గుర్తింపును తెలిపే చిహ్నాలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి గుర్తింపు లేదు. మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం లోగో ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ప్రభుత్వం మొదటి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. నూతన లోగో దేశ రాజధాని చరిత్రలో ఇది ఒక మైలురాయి అవుతుందని అందరూ భావిస్తున్నారు.
READ MPORE: Chiranjeevi : చిరంజీవి కలిసిన TFJA, జర్నలిస్టుల సంక్షేమం పై స్పెషల్ చర్చ
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
దేశ రాజధాని ఢిల్లీ అందరికీ తెలిసిందే, అయితే ఢిల్లీ రాష్ట్రమే అయినా కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల, కేంద్రం యజమాయిషి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వ లోగోలే కనిపిస్తాయి. భారతదేశంలో దేశ రాజధానిగా ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, తనకంటూ ఇప్పటివరకు చరిత్రలో ప్రత్యేక లోగో మాత్రం లేకుండా పోయింది. మొత్తానికి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
READ MPORE: Cyclone Effect: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత..
ఢిల్లీ లోగో ఎలా ఉండనుంది
లోగో ఢిల్లీలోని ఆధునికత, పారదర్శకత, ప్రజా సేవా సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించబడింది. అలాగే, నగరంలోని సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేసేలా లోగోను ప్లాన్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానికి దాని గౌరవానికి తగిన ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” ఢిల్లీ లోగో ఆ ప్రయత్నానికి ప్రతీక అని చెప్తున్నారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా. లోగో ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీని ఒక శక్తివంతమైన బ్రాండ్గా స్థాపించడం. ఇది రాజధానిని ప్రజాస్వామ్య విలువలు, సాంకేతిక పురోగతి, పౌర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలబెడుతుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..