Delhi official Logo: ఢిల్లీకి మొదటిసారిగా అధికారిక లోగో.. నవంబర్ 1న ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi official Logo: ఢిల్లీ – పేరుకే దేశ రాజధాని, కానీ ఇప్పటివరకు ఢిల్లీకి ప్రత్యేకంగా చిహ్నం లేదు. భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు తమ ప్రత్యేక గుర్తింపును తెలిపే చిహ్నాలు ఉన్నప్పటికీ, ఢిల్లీకి మాత్రం ఇప్పటి వరకు అలాంటి గుర్తింపు లేదు. మొత్తానికి ప్రస్తుత ప్రభుత్వం లోగో ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఢిల్లీ స్థాపన దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ప్రభుత్వం మొదటి అధికారిక లోగోను ఆవిష్కరించనుంది. నూతన లోగో దేశ రాజధాని చరిత్రలో ఇది ఒక మైలురాయి అవుతుందని అందరూ భావిస్తున్నారు.
READ MPORE: Chiranjeevi : చిరంజీవి కలిసిన TFJA, జర్నలిస్టుల సంక్షేమం పై స్పెషల్ చర్చ
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
దేశ రాజధాని ఢిల్లీ అందరికీ తెలిసిందే, అయితే ఢిల్లీ రాష్ట్రమే అయినా కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల, కేంద్రం యజమాయిషి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా కేంద్ర ప్రభుత్వ లోగోలే కనిపిస్తాయి. భారతదేశంలో దేశ రాజధానిగా ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, తనకంటూ ఇప్పటివరకు చరిత్రలో ప్రత్యేక లోగో మాత్రం లేకుండా పోయింది. మొత్తానికి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
READ MPORE: Cyclone Effect: ఏపీపై మొంథా తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత..
ఢిల్లీ లోగో ఎలా ఉండనుంది
లోగో ఢిల్లీలోని ఆధునికత, పారదర్శకత, ప్రజా సేవా సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించబడింది. అలాగే, నగరంలోని సంప్రదాయం, వారసత్వం, అభివృద్ధి వంటి అంశాలను సమన్వయం చేసేలా లోగోను ప్లాన్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపిన వివరాల ప్రకారం “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానికి దాని గౌరవానికి తగిన ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” ఢిల్లీ లోగో ఆ ప్రయత్నానికి ప్రతీక అని చెప్తున్నారు ఢిల్లీ సీఎం రేఖ గుప్తా. లోగో ఆవిష్కరణ ప్రధాన ఉద్దేశ్యం ఢిల్లీని ఒక శక్తివంతమైన బ్రాండ్గా స్థాపించడం. ఇది రాజధానిని ప్రజాస్వామ్య విలువలు, సాంకేతిక పురోగతి, పౌర భాగస్వామ్యానికి ప్రతీకగా నిలబెడుతుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!