Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. “తాను తవ్వుకున్న గుంతలో తానే పడ్డట్టు” అన్న చందంగా పాకిస్థాన్ పరిస్థితి తయారైంది. భారత్ను ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పాక్.. ఉగ్రవాదులకు నిధులు వెచ్చించి మరి పోషిస్తోంది. ఇదే ఉగ్రవాదుల్లోని ఓ వర్గం మాత్రం దాయాదీ దేశానికి చుక్కలు చూయిస్తుంది. వరుస దాడులతో కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా పాకిస్థాన్లోని బాజౌర్లో ఉన్న మిలిటరీ క్యాంపుపై జరిగిన భారీ ఆత్మాహుతి దాడి ఆ దేశ సైన్యాన్ని వణికించింది. ఈ పక్కా ప్లాన్డ్ అటాక్లో ప్రాథమిక సమాచారం ప్రకారం.. కనీసం 15 మంది సైనికులు మరణించారు. ఉగ్రవాదులు ముందుగా సైనిక స్థావరం వద్ద భారీ పేలుడుకు పాల్పడి, ఆ గందరగోళం మధ్యలో ఆయుధాలతో క్యాంపులోకి చొరబడ్డారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కొద్దిసేపు భీకర కాల్పులు జరిగాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP) ఈ దాడికి బాధ్యత వహించింది. తమ ‘స్పెషల్ ఇస్తషాదీ ఫోర్సెస్’ (SIF) ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించింది. 2025 అక్టోబర్లో క్వెట్టాలో జరిగిన దాడి తర్వాత, టీటీపీ అధికారికంగా బాధ్యత వహించిన ప్రధాన ఆత్మాహుతి దాడి ఇదే కావడం గమనార్హం.
ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంత్నంలో కేవలం వారం వ్యవధిలో ఇలాంటి ఆత్మాహుతి దాడి జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మంగళవారం లక్కీ మర్వత్ జిల్లాలోని నౌరంగ్ బజార్లో పేలుడు పదార్థాలతో నిండిన ఆటో రిక్షాతో జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో దాడిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ ఉగ్రదాడులతో బాజౌర్, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!