Nobel Peace Prize: ‘మేము యుద్ధాన్ని ఆపాం.. శాంతి బహుమతి మాకే ఇవ్వండి’: పాక్ ప్రధాని
- పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ప్రచారం..
- ప్రపంచ శాంతి నెలకొల్పామని చెప్పుకుంటున్న పాక్ మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పాకిస్థాన్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, ప్రపంచాన్ని కాపాడినందుకు గాను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లకు ‘నోబెల్ శాంతి బహుమతి’ ఇవ్వాలట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, పాక్ మీడియా మాత్రం దీన్ని చాలా సీరియస్గా ప్రచారం చేస్తోంది.
ఏం జరిగిందంటే..?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండి యుద్ధాన్ని నివారించిందని అక్కడి మీడియా చెప్పుకుంటోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఈ ఇద్దరు నేతలు ఒక ‘నమ్మకమైన సమాచార దూత’గా పనిచేశారట. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడిన ఘనత అంతా పాకిస్థాన్దే అని వారు భుజాలు చరుచుకుంటున్నారు. లెబనాన్లో 250 మంది మరణించిన గంటల వ్యవధిలోనే ఈ డిమాండ్ రావడం గమనార్హం.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇస్లామాబాద్లో ‘శాంతి’ చర్చలు..
తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత.. ఏప్రిల్ 10న (శుక్రవారం) అమెరికా, ఇరాన్ ప్రతినిధులను తమ దేశానికి పిలిచి విందు ఇచ్చి చర్చలు జరుపుతామని షరీఫ్ గారు ఎక్స్లో (X) పోస్ట్ కూడా చేశారు. దీనికి ‘ఇస్లామాబాద్ టాక్స్’ అని పేరు కూడా పెట్టేసుకున్నారు. టర్కీ, ఈజిప్ట్, చైనా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా చర్చలకు ప్రయత్నించినా.. క్రెడిట్ మాత్రం మాకే రావాలని పాక్ మీడియా ఆరాటపడుతోంది.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది..
సరే.. పాకిస్థాన్ ఇంతలా కష్టపడిందని అనుకుందాం.. కానీ నోబెల్ శాంతి బహుమతి కోసం అసలు యుద్ధాన్ని ఆపే గడువు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా? ఎక్కడైనా క్రెడిట్ దొరికితే ముందుండే ట్రంప్ మామ, ఈ శాంతి బహుమతిని పాక్ ప్రధానికి, ఆర్మీ చీఫ్కు ఎలా వదిలేస్తారు..? అసలే పాక్, ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని ఆపినందుకు అప్పటి నుంచి శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
సొంత దేశంలో ఆర్థిక కష్టాలు, అప్పులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచ శాంతిని కాపాడామని ‘నోబెల్’ కావాలని అడగడం చూస్తుంటే.. వారి ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే నోబెల్ కమిటీ గనుక ఈ వార్తలు వింటే ఏమనుకుంటుందో కానీ, పాక్ మీడియా మాత్రం అప్పుడే షరీఫ్, మునీర్ల కోసం అవార్డు వేదికను సిద్ధం చేసేస్తోంది. మొత్తానికి.. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ‘మహావీరుల’ జాబితాలో తమ పేర్లు ఉండాలని పాక్ ఆశపడుతోంది. చూద్దాం.. నోబెల్ వస్తుందో లేదో..!
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!