పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మార్చి 2026లో బంగ్లాదేశ్కు వెళ్లి మూడు మ్యాచ్ల ODI సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సిరీస్ పూర్తిగా అనిశ్చితిలో పడింది. పశ్చిమ ఆసియాలో (మిడిల్ ఈస్ట్) జరుగుతున్న జియోపాలిటికల్ టెన్షన్స్, ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, ఇతర దేశాల (UAE, సౌదీ అరేబియా వంటివి) ప్రమేయం కారణంగా పాకిస్తాన్ టీమ్ బంగ్లాదేశ్కు ట్రావెల్ చేయడం ప్రమాదకరంగా మారింది. సిరీస్ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ టీమ్ మార్చి 9న ఢాకాకు చేరుకోవాలి. మూడు ODI మ్యాచ్లు.. మార్చి 11, 13, 15 తేదీల్లో షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం (మిర్పూర్)లో జరగాల్సి ఉంది.
పాకిస్తాన్ మీడియా ఔట్లెట్ జియో సూపర్ ప్రకారం, ప్రస్తుత రీజనల్ టెన్షన్స్ మరింత పెరిగితే ట్రావెల్ రిస్క్లు, సెక్యూరిటీ ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సిరీస్ పోస్ట్పోన్ లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సోర్సెస్ తెలిపాయి. PCB ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, కానీ ఇన్సైడర్ల ప్రకారం సిరీస్ జరిగేందుకు పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ అనిశ్చితి గురించిన రిపోర్టులను తిరస్కరించింది. PCB నుంచి ఏవిధమైన అధికారిక కమ్యూనికేషన్ రాలేదని, సిరీస్ ప్రిపరేషన్స్ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని BCB అధికారులు చెప్పారు. ఢాకాకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయని, బంగ్లాదేశ్లో ఎలాంటి సెక్యూరిటీ ఆందోళనలు లేవని వారు స్పష్టం చేశారు.
Also Read:Holi Official Holiday 2026: హోలీ సెలవుపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
ఈ సిరీస్ ముందు పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8 దశలోనే నిష్క్రమించింది. దీంతో PCB ఆటగాళ్లపై భారీ ఫైన్లు విధించింది (ప్రతి ఆటగాడికి PKR 5 మిలియన్). బాబర్ అజామ్, సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ వంటి సీనియర్లను ఈ ODI సిరీస్కు డ్రాప్ చేసే అవకాశం ఉందని రిపోర్టులు వచ్చాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని PCB ఆలోచిస్తోంది. ప్రస్తుతం సిరీస్ భవిష్యత్ పూర్తిగా మిడిల్ ఈస్ట్ పరిస్థితులపై ఆధారపడి ఉంది. పరిస్థితి మెరుగుపడకపోతే రెండు బోర్డుల మధ్య చర్చలు జరిగి సిరీస్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది.
