Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్థాన్ బలుపు మాటలు అస్సలు తగ్గడం లేదు. ఓ వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధంతో దాయాది దేశం అతలాకుతలమవుతోంది. నిత్యవసర సరకులతోపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంత జరిగినా బలుపు మాత్రం తగ్గడం లేదు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే తినడానికి సరిగ్గా తిండి దొరకక కొట్టుమిట్టాడుతున్న పాక్ భారత్పై దాడి చేస్తుందట. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చికూతలు కూశాడు. వాస్తవానికి, ఇటీవల భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భారత్ ఇచ్చే సమాధానం గతంలో కంటే చాలా డేంజర్గా ఉంటుందని వెల్లడించారు.
READ MORE: Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్
Also Read
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- India T20 Captaincy: సూర్యకుమార్కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
ఉరి దాడుల తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా అనంతరం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులు, పహల్గామ్ ఘటన తర్వాత నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ వంటి పరాక్రమాలను గుర్తు చేశారు. ఈ వార్నింగ్తో పాకిస్థాన్ ఒక్కసారిగా బెంబేలెత్తింది. ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో భారత్ పాక్ను బెదిరిస్తోందని ఆరోపించారు. భారత్ తమపై దాడి చేస్తూ తాము చూస్తూ ఊరుకోమన్నారు. తమ ప్రతిదాడులు భారత్ లోపలి వరకు వెళ్తాయని వెర్రి కూతలు కూశారు. జమ్ముకశ్మీర్, పంజాబ్లోనే కాదు. కోల్కతా వరకు దాడులు చేస్తామని, తమ వద్ద ఆ స్థాయి మిస్సైల్స్ ఉన్నాయన్నారు. భారత్ తమపై దాడులు చేసేందుకు ప్రస్తుతం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక పాకిస్థాన్ ఇంతలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆ దేశం వద్ద ఉన్న 2750 కిలోమీటర్ల పరిధి గల అత్యంత సుదూర క్షిపణి షాహీన్-III అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!