Pakistan : తెహ్రీక్-ఇ-తాలిబాన్.. పాకిస్తాన్ సైన్యం మధ్య భారీ ఘర్షణ.. కొనసాగుతున్న ఆపరేషన్
Pakistan : పాకిస్థాన్లోని మీర్ అలీ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఒకప్పుడు సందడిగా ఉండే పశువుల మార్కెట్, పరిసర ప్రాంతాలు పూర్తిగా బూడిద అయ్యాయి. ఇందులో అనేక అమాయక పశువులు ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.
ఉత్తర వజీరిస్థాన్లోని మీర్ అలీలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడ నివసించే ప్రజలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇది మొత్తం ప్రాంతంలో మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మీర్ అలీ తహసిల్ ప్రాంతంలో ఉదయం రెండు శక్తివంతమైన పేలుళ్ల ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించాయి.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Read Also:HYDRA Demolition: మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఫోకస్..!
భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఈ ఘర్షణ ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్కు వ్యాపించింది. దీని కారణంగా ఆ ప్రాంతంలోని అన్ని దుకాణాలు, రోడ్లు మూతపడిపోయాయి. ఉత్తర వజీరిస్థాన్లో ఉగ్రవాద మూలకాలను రూపుమాపేందుకు సైన్యం నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అలాగే, సైన్యం ఆ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం వారి ఇళ్లలోనే ఉండాలని చెప్పారు.
ఉత్తర వజీరిస్థాన్లోని మీర్ అలీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో చాలా నష్టం జరిగింది. ఇది స్థానిక వ్యాపారాలు, దుకాణాలు, ఆస్తులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. మార్కెట్లోని పలు దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాల్పుల కారణంగా, ఆ ప్రాంతంలోని పశువుల మార్కెట్లో కూడా మంటలు చెలరేగాయి. దాని కారణంగా అనేక జంతువులు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి.
Read Also:SBI SCO 2024: ఎస్బీఐలో బంపర్ రిక్రూట్మెంట్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1497 ఖాళీలు
తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కి చెందిన హఫీజ్ గుల్ బహదర్ గ్రూప్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. జైషే ఒమారీ బ్రిగేడ్తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్కౌంటర్లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అనేక ఇతర నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో