Pakistan : తెహ్రీక్-ఇ-తాలిబాన్.. పాకిస్తాన్ సైన్యం మధ్య భారీ ఘర్షణ.. కొనసాగుతున్న ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని మీర్ అలీ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీకి మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణ స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఒకప్పుడు సందడిగా ఉండే పశువుల మార్కెట్, పరిసర ప్రాంతాలు పూర్తిగా బూడిద అయ్యాయి. ఇందులో అనేక అమాయక పశువులు ఎదురుకాల్పుల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.
ఉత్తర వజీరిస్థాన్లోని మీర్ అలీలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడ నివసించే ప్రజలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇది మొత్తం ప్రాంతంలో మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగిలిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మీర్ అలీ తహసిల్ ప్రాంతంలో ఉదయం రెండు శక్తివంతమైన పేలుళ్ల ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించాయి.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Read Also:HYDRA Demolition: మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఫోకస్..!
భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఈ ఘర్షణ ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్కు వ్యాపించింది. దీని కారణంగా ఆ ప్రాంతంలోని అన్ని దుకాణాలు, రోడ్లు మూతపడిపోయాయి. ఉత్తర వజీరిస్థాన్లో ఉగ్రవాద మూలకాలను రూపుమాపేందుకు సైన్యం నిరంతరం సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. అలాగే, సైన్యం ఆ ప్రాంతంలో అలర్ట్ జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తమ భద్రత కోసం వారి ఇళ్లలోనే ఉండాలని చెప్పారు.
ఉత్తర వజీరిస్థాన్లోని మీర్ అలీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో చాలా నష్టం జరిగింది. ఇది స్థానిక వ్యాపారాలు, దుకాణాలు, ఆస్తులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. మార్కెట్లోని పలు దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాల్పుల కారణంగా, ఆ ప్రాంతంలోని పశువుల మార్కెట్లో కూడా మంటలు చెలరేగాయి. దాని కారణంగా అనేక జంతువులు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి.
Read Also:SBI SCO 2024: ఎస్బీఐలో బంపర్ రిక్రూట్మెంట్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1497 ఖాళీలు
తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కి చెందిన హఫీజ్ గుల్ బహదర్ గ్రూప్ ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. జైషే ఒమారీ బ్రిగేడ్తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఎన్కౌంటర్లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అనేక ఇతర నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని దుకాణాలన్నీ మూతపడ్డాయి. సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!