Pakistan vs Namibia: నమీబియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే నెక్ట్స్ మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్కు అవకాశం ఉండేది. ఈ ఒత్తడిలోనూ పాక్ ప్లేయర్లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ బతికి పోయింది. పాక్ జట్టు ఏకంగా 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan). సాహిబ్జాదా ఫర్హాన్ కేవలం 58 బంతుల్లోనే 100 పరుగులు చేసి టీమ్ను అజేయంగా నిలిపాడు. తన ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ప్రారంభం నుంచే ధైర్యంగా ఆడుతూ నమీబియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేశాడు.
READ MORE: Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!
ఫర్హాన్కు మద్దతుగా సల్మాన్ ఆగా 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ సైతం 22 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఈ స్కోరు నమీబియాకు చాలా పెద్ద లక్ష్యంగా మారింది. ఛేజ్ చేసే ప్రయత్నంలో నమీబియా బ్యాటర్లు వరుసగా ఔటవుతూ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. లౌరెన్ స్టీన్క్యాంప్ 23, అలెగ్జాండర్ వోల్స్చెంక్ 20 పరుగులు చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు పెద్దగా నిలబడలేకపోయారు. మొత్తం జట్టు 17.3 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. బౌలింగ్లో ఉస్మాన్ తారిక్ నాలుగు వికెట్లు తీసి నమీబియాను కట్టడి చేశాడు. అతని స్పిన్ దెబ్బకు ప్రత్యర్థి జట్టు పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ఈ విజయంతో పాకిస్తాన్ తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది. సూపర్ ఎయిట్ గ్రూప్ 2లో ఇప్పటికే ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జతకట్టింది. ఈ మ్యాచ్లో ఫర్హాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. “నేను దేశీయ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వను. గత నాలుగేళ్లుగా దేశీయ క్రికెట్లో కష్టపడి ఆడుతున్నాను. ఆ కష్టానికి ఇదే ఫలితం” అని ఫర్హాన్ ఆనందంగా చెప్పాడు.