Pak- Afghan war: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు.. సౌదీ అరేబియా, ఖతార్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak- Afghan war: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది. కాందహార్లోని మైవాండ్ జిల్లాలో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు ఇస్లామిక్ ఎమిరేట్ దళాలకు లొంగిపోయినట్లు నివేదిస్తోంది. ఇంతలో, పాకిస్థాన్ మీడియా సంస్థలు మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటుండగా.. దాయాది దేశానికి చెందిన దున్యా న్యూస్ అనేక ఆఫ్ఘన్ పోస్టులను నాశనం చేసి, డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ సైనికులు మరణించారని పేర్కొంది. అనేక ఆఫ్ఘన్ పోస్టులు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అనేక ఆఫ్ఘన్ పోస్టులను ఫిరంగి, ట్యాంకులు, వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. పాకిస్థాన్ ట్యాంక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి.
READ MORE: పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బుల్లెట్ల యుద్ధం..!
Also Read
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
సౌదీ అరేబియా, ఖతార్ కలత..
పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్థన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాని విదేశాంగ మంత్రిత్వ శాఖ, “రెండు దేశాలు సంయమనం పాటించి, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఈ ప్రాంతం భద్రత, స్థిరత్వానికి శాంతి చాలా అవసరం” అని పేర్కొంది. ఖతార్ కూడా ఇదే విధంగా స్పందించింది. “ఉద్రిక్తతను తగ్గించడం, సంయమనం పాటించి శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దౌత్యం, సంభాషణల ద్వారా పరిస్థితిని మెరుగు పర్చుకోవాలి.” అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!