పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సొంతగడ్డపై ఎట్టకేలకు టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దాంతో 1338 రోజుల నిరీక్షణకు తెరపడింది. వరుసగా 11 మ్యాచుల్లో ఓడిపోయిన పాక్కు తొలి గెలుపు దక్కడంతో ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.