Pakistan: ‘టీ’ తాగడం తక్కువ చేయండి ప్లీజ్.. ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి
దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆ దేశం దివాళా అంచున ఉంది. కొన్ని రోజుల్లో శ్రీలంక పట్టిన గతే పాకిస్తాన్ కు కూడా పట్టబోతోందని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఎడాపెడా డిజిల్, పెట్రోల్ రేట్లు పెంచుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్నాయి. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటుంది.
తాజాగా పాకిస్తాన్ ఫెడరల్ ప్లానింగ్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్.. పాక్ ప్రజలు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. టీ వినియోగాన్ని 1-2 కప్పులకు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటుకుపోతున్న నేపథ్యంలో, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న టీ పొడిని తగ్గించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 మిలియన్ డాలర్ల విలువైన టీ పౌడర్ ను పాక్ దిగుమతి చేసుకుంది.
Also Read
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
ప్రపంచంలో టీని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దీని కోసం ప్రస్తుతం అప్పుల చేయాల్సి వస్తోందని పాక్ మంత్రి అన్నారు. టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేయడంపై పాక్ ప్రజలు ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పాక్ లో ఇంధన సమస్య ఏర్పడింది. రాత్రి 10 తరువాత దేశ రాజధాని ఇస్లామాబాద్ లో పెళ్లి వేడుకలు చేసుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 8.30 గంటల తరువాత మార్కెట్లు మూసివేయాలని వ్యాపారులను, పాక్ ప్రణాళిక మంత్రి కోరాడు. పెట్రోలియ ఉత్పత్తుల దిగుమతిని తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి శ్రీలంకలా మారతుందని ఇటీవల ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో