Tripura Elections: త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ముఖ్య ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ దినకర్రావు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 81.1శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని.. వెంటనే వాటిని మార్చేసినట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జ్లో ఉపన్యాసం..
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా జరిగిన త్రిపుర ఎన్నికలతో మినీ సార్వత్రికం ప్రారంభమైనట్లైంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేస్తుండగా… సీపీఎం-కాంగ్రెస్తో జట్టు కట్టి బరిలో నిలిచింది. ప్రద్యోత్ బిక్రమ్ మానిక్య దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో తలపడుతోంది.
Also Read: Swara Bhasker: రాజకీయ నాయకుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ నటి
ఈ ఏడాది ఎన్నికలకు జరిగిన తొలి రాష్ట్రం త్రిపుర. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు మరో ఐదు రాష్ట్రాలు ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. త్రిపురలో 20 మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ ఈసారి 12 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. 2018కి ముందు త్రిపురలో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ, గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని, సరిహద్దులో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ను గద్దె దించింది. 1978 నుండి 35 సంవత్సరాలు లెఫ్ట్నెంట్ సర్కారు త్రిపురను పాలించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు గెలుచుకుని 43.59 శాతం ఓట్లను సాధించింది. సీపీఐ (ఎం) 42.22 శాతం ఓట్లతో 16 సీట్లు గెలుచుకుంది. ఐపీఎఫ్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ తన ఖాతా తెరవలేకపోయింది.
Also Read: Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!