Tripura Elections: త్రిపురలో ప్రశాంతంగా ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ సజావుగా సాగిందని ముఖ్య ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ దినకర్రావు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించగా 81.1శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని.. వెంటనే వాటిని మార్చేసినట్లు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ యూకే పర్యటన.. కేంబ్రిడ్జ్లో ఉపన్యాసం..
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తన ఓటు హక్కును అగర్తలాలో వినియోగించుకున్నారు. త్రిపురలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా జరిగిన త్రిపుర ఎన్నికలతో మినీ సార్వత్రికం ప్రారంభమైనట్లైంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేస్తుండగా… సీపీఎం-కాంగ్రెస్తో జట్టు కట్టి బరిలో నిలిచింది. ప్రద్యోత్ బిక్రమ్ మానిక్య దేవ్ వర్మ నేతృత్వంలోని తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో తలపడుతోంది.
Also Read: Swara Bhasker: రాజకీయ నాయకుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ నటి
ఈ ఏడాది ఎన్నికలకు జరిగిన తొలి రాష్ట్రం త్రిపుర. నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, 2024లో లోక్సభ ఎన్నికలకు ముందు మరో ఐదు రాష్ట్రాలు ఈ ఏడాది ఎన్నికలను ఎదుర్కోనున్నాయి. త్రిపురలో 20 మంది మహిళలు సహా మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ ఈసారి 12 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. 2018కి ముందు త్రిపురలో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ, గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు పెట్టుకుని, సరిహద్దులో అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ను గద్దె దించింది. 1978 నుండి 35 సంవత్సరాలు లెఫ్ట్నెంట్ సర్కారు త్రిపురను పాలించింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు గెలుచుకుని 43.59 శాతం ఓట్లను సాధించింది. సీపీఐ (ఎం) 42.22 శాతం ఓట్లతో 16 సీట్లు గెలుచుకుంది. ఐపీఎఫ్టీ ఎనిమిది స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ తన ఖాతా తెరవలేకపోయింది.
Also Read: Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!