WTC 2023: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తేదీ, వేదిక ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్ తేదీ ఖరారైంది. జూన్ 7-11 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అలాగే ఈ తుదిపోరుకు ఇంగ్లాండ్లోని ఓవల్ ఆతిథ్యమివ్వనుందని తెలిపింది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. ఏదైనా కారణాల వల్ల పూర్తి ఐదు రోజులు జరగకపోతే ఈ రిజర్వ్ డేలో ఆడిస్తారు. మొదటి సీజన్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Also Read: Dinesh Karthik: ‘ఆ పోస్ట్ను డిలీట్ చేయ్’..నెటిజన్పై కార్తీక్ సీరియస్ అయ్యాడా?
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
ప్రతి టెస్టు ఛాంపియన్ షిప్ సీజన్ రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. రెండో సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 75.56% పాయింట్ల అగ్రస్థానంలో ఉంది. ఇండియా (58.93%) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్లో రెండు మ్యాచ్లు గెలిస్తే టీమిండియా ఫైనల్కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ రెండు జట్లతో పాటు మరో నాలుగు జట్లు ఫైనల్ బెర్తుపై కన్నేశాయి. మూడో ప్లేస్లో ఉన్న శ్రీలంక (53.33%), నాలుగో స్థానంలోని సౌతాఫ్రికా(48.72%), ఐదు, ఆరు ర్యాంకింగ్స్లో నిలిచిన న్యూజిలాండ్, వెస్టిండీస్కు ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఇందులో న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా.. సౌతాఫ్రికాలో వెస్టిండీస్ రెండు మ్యాచ్లు ఆడాలి.
Also Read: AK 62: ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది…
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!