Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్లో భాగంగా ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్ఫోన్ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్తో ఈ ఫోన్ వస్తోంది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని ఒప్పో కంపెనీ పేర్కొంటోంది.ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ ఆర్మర్డ్ బాడీ, ప్రీమియం లెదర్ ఫినిషింగ్ని కలిగి ఉంది.
Oppo F27 Pro+ 5G Price:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ వేరయంట్ ధర రూ.27,999గా కాగా.. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. జూన్ 20 నుంచి ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు లభిస్తాయి. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్.. డస్క్ పింక్, మిడ్నైట్ నావీ రంగుల్లో లభించనుంది.
Oppo F27 Pro+ 5G Specs:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 3డీ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్తో ఈ ఫోన్ రన్ అవుతుంది.
Also Read: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
Oppo F27 Pro+ 5G Camera and Battery:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.