Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్థాన్లోని మురిడ్కేలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మే 7 రాత్రి భారత వైమానిక దళం ఈ కాంప్లెక్స్ను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. దాడిలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఇప్పుడు లష్కర్ స్వయంగా JCB యంత్రాలతో కూల్చివేసింది. ఎందుకు ఈ ఉగ్రవాదులు వారి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు. అసలు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Sudershan Reddy : ఆత్మ ప్రబోధంతో ఓటేయండి
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఉగ్ర సంస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించిందా?
మే 7న పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:35 గంటలకు భారత వైమానిక దళం మురిడ్కేలోని మర్కజ్ తైబాపై వైమానిక దాడి నిర్వహించింది. గత 25 ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ, వసతి, ఆయుధాలు అందిస్తున్న ప్రదేశం ఇదే. రెండు అంతస్తుల ఈ భవనం ‘ఉమ్-ఉల్-ఖురా’ ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనాల్లో లష్కరే అగ్ర కమాండర్ల కార్యాలయాలు, ఉగ్రవాదుల నివాస గదులు ఉన్నాయి. తాజా ఉగ్ర సంస్థ ఈ శిథిలాలను పూర్తి కూల్చివేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి ఈ ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం దెబ్బతిన్న భవనాలను తన ఖర్చుతో పునర్నిర్మించుకుంటామని ప్రకటించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఆగస్టు 18 నుంచి లష్కరే స్వయంగా JCB యంత్రాలతో శిథిలాలను కూల్చివేస్తుంది. సెప్టెంబర్ 4 నాటికి, ‘ఉమ్-ఉల్-ఖురా’ కూల్చివేశారు. తాజా ఈరోజు ఉదయం ఎర్ర భవనాన్ని కూడా కూల్చివేశారు.
కొత్త నిర్మాణానికి సన్నాహాలు..
లష్కరే తోయిబా 2026లో జరిగే వార్షిక కార్యక్రమానికి ముందు కనీసం ఒక భాగాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని పలు నివేదికలు తెలిపాయి. ఈ పని మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. కసూర్ జిల్లాలోని పటోకిలో ఉన్న ‘మర్కజ్ యార్మౌక్’ వద్ద ఉగ్రవాదులకు తాత్కాలిక శిక్షణ, వసతి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.
READ ALSO: Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!