Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్థాన్లోని మురిడ్కేలో ఉన్న లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. మే 7 రాత్రి భారత వైమానిక దళం ఈ కాంప్లెక్స్ను లక్ష్యంగా చేసుకొని బాంబులు కురిపించింది. దాడిలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని ఇప్పుడు లష్కర్ స్వయంగా JCB యంత్రాలతో కూల్చివేసింది. ఎందుకు ఈ ఉగ్రవాదులు వారి భవనాన్ని పూర్తిగా కూల్చివేస్తున్నారు. అసలు లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Sudershan Reddy : ఆత్మ ప్రబోధంతో ఓటేయండి
Also Read
- Siddaramaiah: "హిజాబ్"కు అనుమతి, "కాషాయ కండువాల"కు నో పర్మిషన్..
- Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
- TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
ఉగ్ర సంస్థ పునర్నిర్మాణంపై దృష్టి సారించిందా?
మే 7న పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12:35 గంటలకు భారత వైమానిక దళం మురిడ్కేలోని మర్కజ్ తైబాపై వైమానిక దాడి నిర్వహించింది. గత 25 ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ, వసతి, ఆయుధాలు అందిస్తున్న ప్రదేశం ఇదే. రెండు అంతస్తుల ఈ భవనం ‘ఉమ్-ఉల్-ఖురా’ ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనాల్లో లష్కరే అగ్ర కమాండర్ల కార్యాలయాలు, ఉగ్రవాదుల నివాస గదులు ఉన్నాయి. తాజా ఉగ్ర సంస్థ ఈ శిథిలాలను పూర్తి కూల్చివేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నాటికి ఈ ప్రదేశంలో కొత్త భవనాలను నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత దాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం దెబ్బతిన్న భవనాలను తన ఖర్చుతో పునర్నిర్మించుకుంటామని ప్రకటించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఆగస్టు 18 నుంచి లష్కరే స్వయంగా JCB యంత్రాలతో శిథిలాలను కూల్చివేస్తుంది. సెప్టెంబర్ 4 నాటికి, ‘ఉమ్-ఉల్-ఖురా’ కూల్చివేశారు. తాజా ఈరోజు ఉదయం ఎర్ర భవనాన్ని కూడా కూల్చివేశారు.
కొత్త నిర్మాణానికి సన్నాహాలు..
లష్కరే తోయిబా 2026లో జరిగే వార్షిక కార్యక్రమానికి ముందు కనీసం ఒక భాగాన్ని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోందని పలు నివేదికలు తెలిపాయి. ఈ పని మౌలానా అబూ జార్, యూనస్ షా బుఖారీ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు సమాచారం. కసూర్ జిల్లాలోని పటోకిలో ఉన్న ‘మర్కజ్ యార్మౌక్’ వద్ద ఉగ్రవాదులకు తాత్కాలిక శిక్షణ, వసతి ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.
READ ALSO: Chandra Grahanam: కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. చూడాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం
తాజావార్తలు
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!