Kolkata: ఇది భారత్.. పాకిస్థాన్ కాదు.. “ఆపరేషన్ సిందూర్” థీమ్తో దుర్గా మండపం.. తొలగించాలని పోలీసుల ఒత్తిడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: “ఆపరేషన్ సిందూర్” అనే థీమ్తో కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సరిహద్దు వైమానిక దాడులను ఈ మండపం గుర్తు చేస్తుంది. అయితే.. తాజాగా పోలీసులు ఈ మండపాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం…
READ MORE: Durga Idol Blindfolded: కళ్లకు గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహం చేసిన శిల్పి
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఈ పూజ పండల్ ప్రారంభోత్సవం జరిగిన ఒక రోజు తర్వాత.. బీజేపీ కౌన్సిలర్, పూజా కమిటీ కార్యదర్శి సజల్ ఘోష్ కోల్కతా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. “గత మూడు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కానీ కోల్కతా పోలీసులు ఈ మండపాన్ని మూసివేయడానికి కుట్ర పన్నుతున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు వేసి, జనసమూహాన్ని మళ్లిస్తున్నారు. మా పూజ మండపంలోకి ప్రజలు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. మా ఆపరేషన్ సిందూర్ థీమ్ కొంతమందికి తలనొప్పిగా మారింది. అందువల్ల, రాజకీయ ప్రతీకార చర్యగా ఈ మండపాన్ని మూసివేయడానికి అధికార పార్టీ పోలీసులను ఒక సాధనంగా ఉపయోగిస్తోంది.” అని సజల్ ఘోష్ అన్నారు. ఈ అంశంపై స్థానిక ప్రజలు సైతం మండిపడుతున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది భారతదేశం పాకిస్థాన్ కాదు అంటూ మండిపడుతున్నారు.
READ MORE: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ సంచలన ప్రకటన.. మృతుల సంఖ్య పెరుగనుందా..?
The way the West Bengal government is making every possible effort to stop the Durga Puja at Santosh Mitra Square, inaugurated this year by Union Home Minister Amit Shah, is utterly shameful.
The TMC-led Mamata administration is obstructing the worship of Goddess Durga. From… pic.twitter.com/h0BlbLJFLE
— Amit Malviya (@amitmalviya) September 27, 2025
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!