Kolkata: ఇది భారత్.. పాకిస్థాన్ కాదు.. “ఆపరేషన్ సిందూర్” థీమ్తో దుర్గా మండపం.. తొలగించాలని పోలీసుల ఒత్తిడి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata: “ఆపరేషన్ సిందూర్” అనే థీమ్తో కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సరిహద్దు వైమానిక దాడులను ఈ మండపం గుర్తు చేస్తుంది. అయితే.. తాజాగా పోలీసులు ఈ మండపాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం…
READ MORE: Durga Idol Blindfolded: కళ్లకు గంతలు కట్టుకొని దుర్గామాత విగ్రహం చేసిన శిల్పి
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ఈ పూజ పండల్ ప్రారంభోత్సవం జరిగిన ఒక రోజు తర్వాత.. బీజేపీ కౌన్సిలర్, పూజా కమిటీ కార్యదర్శి సజల్ ఘోష్ కోల్కతా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. “గత మూడు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కానీ కోల్కతా పోలీసులు ఈ మండపాన్ని మూసివేయడానికి కుట్ర పన్నుతున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు వేసి, జనసమూహాన్ని మళ్లిస్తున్నారు. మా పూజ మండపంలోకి ప్రజలు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. మా ఆపరేషన్ సిందూర్ థీమ్ కొంతమందికి తలనొప్పిగా మారింది. అందువల్ల, రాజకీయ ప్రతీకార చర్యగా ఈ మండపాన్ని మూసివేయడానికి అధికార పార్టీ పోలీసులను ఒక సాధనంగా ఉపయోగిస్తోంది.” అని సజల్ ఘోష్ అన్నారు. ఈ అంశంపై స్థానిక ప్రజలు సైతం మండిపడుతున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది భారతదేశం పాకిస్థాన్ కాదు అంటూ మండిపడుతున్నారు.
READ MORE: Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ సంచలన ప్రకటన.. మృతుల సంఖ్య పెరుగనుందా..?
The way the West Bengal government is making every possible effort to stop the Durga Puja at Santosh Mitra Square, inaugurated this year by Union Home Minister Amit Shah, is utterly shameful.
The TMC-led Mamata administration is obstructing the worship of Goddess Durga. From… pic.twitter.com/h0BlbLJFLE
— Amit Malviya (@amitmalviya) September 27, 2025
తాజావార్తలు
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!