Operation Karriguttalu : ఆపరేషన్ కర్రిగుట్టలు.. అసలు ఏం జరుగుతోంది..?
- కర్రిగుట్టల్లో భారీ ఆపరేషన్
- మావోయిస్టులపై భద్రతా బలగాల దాడి
- హిడ్మా కోసం సీఆర్పీఎఫ్ కూంబింగ్
ఆపరేషన్ కర్రిగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..చతిస్గడ్ తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్ ..కర్రెగుట్టలే టార్గెట్గా భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి.. వేలమంది భద్రత బలగాలు ఇప్పుడు కర్రే గుట్టల వైపు దూసుకొనికుని వెళ్తున్నాయి.. ఏ క్షణం లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది.. అంతేకాకుండా వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కర్రిగుట్టలో భారీ ఆపరేషన్ జరుగుతుంది.. హత్యకాండను వెంటనే ఆపాలని పౌరసంగాలు డిమాండ్ చేస్తున్నాయి.. ఈమెరకు పౌర సంఘాలు ఏకంగా సమావేశం పెట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేయ్.. ఒకవైపు చర్చల ప్రతిపాదనల లు ముందుకు తెస్తూనే మరోవైపు హత్యాకాండ కొనసాగించడం దుర్మార్గమని ప్రజాసంఘాలు ఆక్షేపిస్తున్నాయి.. మరోవైపు కర్రెగుటలా కింది భాగంలో మందు పాత్రలు ఏర్పాటు చేశామని ఆ ప్రాంతానికి ఎవరూ రావద్దని ఆదివాసులను మావోయిస్టు లు హెచ్చరించారు ..ఇది ఆదివాసుల జీవన విధానానికి భంగం కలిగించే విధంగా ఉందని పోలీసులు చెప్పారు..
ఆదివాసుల జీవన విధానానికి భంగం కలిగిస్తున్న మావోయిస్టులకు తగిన విధంగా బుద్ధి చెప్తామని పోలీసులు అంటున్నారు ..ఏది ఏమైనాపటికి కర్రీగుట్టలో అసలు ఏం జరుగుతుంది? కర్రీగుట్టలే టార్గెట్ గా ఇప్పుడు భద్రత బలగాలు ఎందుకు ముందుకు వెళ్తున్నాయి.. అసలు కర్రిగుట్ట అడవుల్లో ఎవరు బాగా వేసుకున్నారు ..వేల సంఖ్యలో మావోయిస్టులు అక్కడ బాగా వేసి ఉన్నారని భద్రత బలగాలు చెప్తున్నాయి. కానీ కర్రిగుట్టలే ఎందుకు టార్గెట్ చేశారు.. ఆపరేషన్ కర్రీ గుట్టలు ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారిపోయింది.. 2 వేల మంది సాయుధ బలగాలు. గంటల తరబడి కూంబింగ్. హోరాహోరీ ఎన్కౌంటర్. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ హిడ్మా కోసం ఆపరేషన్ జరుగుతుందని సంఘాలు చెప్తున్నాయి.. .ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు, CRPF బలగాల మధ్య బీకర కాల్పులు జరుగుతున్నాయి.. ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ కు కర్రిగుట్టలు విస్తరించి ఉన్నాయి.. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు నుంచి కర్రెగుట్టలను ఒకేసారి చుట్టుముట్టారు CRPF జవాన్లు చుట్టూ ముట్టారు..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
మావోయిస్టులు.. శాంతి చర్చలకు పిలుపు ఇచ్చారు. దండకారణ్యంలో కాల్పులు ఆపేస్తే.. చర్చలకు సిద్ధమని ముందుకు వచ్చారు. అయినా, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపింది.. చతిస్గడ్ ఉప ముఖ్యమంత్రి మాత్రం చర్చల పత్తిపాదాలను ఆహ్వానించారు.. ఇది జరుగుతున్న తరుణంలోనే కర్రెగుట్టల వైపు ఆదివాసీలు ఎవరూ రావొద్దంటూ మావోయిస్టులు ఒక ప్రకటన చేశారు. గుట్ట చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చినట్టు చెప్పారు. బచావో కర్రెగుట్టలు పేరుతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులు దాగున్న ప్రదేశాన్ని గుర్తించి కర్రెగుట్టలను రెండు వైపుల నుంచి చుట్టుముట్టారు. కర్రిగుట్ట అటవీ ప్రాంతం నుంచి భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి.. ఇరు దళాల మధ్య భారీ కాల్పులు జరుగుతున్నట్లుగా సమాచారం…
2 వేల మంది సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు కోబింగు ఆపరేషన్ చేస్తున్నాయి.. కర్రెగుట్టల్లో హిడ్మా దాగున్నాడని అంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఈ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా. చిక్కడు దొరకడు టైప్లో అనేక ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకుంటున్నాడు. మావోయిస్ట్ ఉద్యమంలో ప్రస్తుతం అందరికంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నది హిడ్మానే. ఆయన సారధ్యంలోనే కోబ్రా, పోలీసులపై మెరుపు దాడులు జరుగుతున్నాయి. ఒక్క హిడ్మా కోసం కేంద్ర బలగాల ముందుకు సాగుతున్నాయి…. కర్రీ గుట్టలను పూర్తిగా రక్షించాలన్న లక్ష్యంతో భద్రతా బలగాలు ముందుకు వెళుతున్నట్టు చెప్తున్నాయి అయితే కర్రిగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ పై పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి ఒకవైపు చర్చల ప్రతిపాదన నడుస్తూనే మరోవైపు హత్యాకాండ కొనసాగించడం దుర్మార్గమని అంటున్నాయి ఎందుకు సంబంధించి పౌర సంఘాలు సమావేశమై ప్రభుత్వ చర్యలను తప్పుపట్టాయి కర్రెగుటల్లో జరుగుతున్న ఆపరేషన్ వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశాయి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!