Hyderabad: హైదరాబాద్ లో ఉగ్రమూలాలు.. ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీకి షెల్టర్ ఇచ్చింది ఎవరు?
- హైదరాబాద్ లో మరోసారి బయటపడ్డ ఉగ్రమూకలు
- అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ కు షెల్టర్
- ఆరు నెలలు సికింద్రాబాద్ లో రిజ్వాన్
- ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు
- విచారణలో సంచలన విషయాలు
దేశంలో ఎక్క ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ తో ముడిపడి ఉంటున్నాయి. హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసులు ఫరిదాబాద్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేశారు. న్యాయస్థానం అనుమతితో కస్టడిలోకి తీసుకున్న పోలీసులకు విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్ అలీ యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడంలో దిట్ట. సుమారు ఏడాది కాలంగా పరారీలో ఉన్న ఇతడిపై ఎన్ఐఏ రూ. 3 లక్షల రివార్డు ప్రకటించింది. రిజ్వాన్ కేరళతో పాటు హైదరాబాద్ లోనూ తలదాచుకున్నట్లు విచారణలో తేలింది. నగరానికి చెందిన ఘోరీతో రిజ్వాన్ నిత్యం సంప్రదింపులు జరిపినట్లు తేటతెల్లమైంది. రాష్ట్ర నిఘా విభాగానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లింది.
READ MORE: Champai Soren: బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఏమన్నారంటే..!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015-2016 మధ్య ఆన్లైన్ నుంచి ఉగ్రవాద ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. ఝార్ఖండ్ నుంచి ఢిల్లీ వచ్చి.. షహీన్ బాగ్ కు చెందిన షాన్వాజ్ తో 2017లో పరిచయం పెంచుకున్నాడు. అతడి ద్వారా రిజ్వాన్ అలీ ఉగ్ర కార్యకలాపాలను ప్రారంభించాడు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరఖండ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఐసిస్ మాడ్యూల్ విస్తరణతో పాటు… నిధుల సేకరణకు పనిచేశాడు. పెద్ద సంఖ్యలో యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్శించి ఉగ్రవాదం వైపు మళ్లించాడు. గతేడాది పుణె పోలీసులు షానవాజ్ మాడ్యూల్ గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో అగ్నతంలోకి వెళ్లిపోయిన రిజ్వాన్ ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ లో తలదాచుకున్నాడు. ఇతడిని మోస్ట్ వాంటెడ్ గా గుర్తించిన ఎన్ఐఏ..రూ. మూడు లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలు గుర్తించిన ఢిల్లీ స్పేషల్ సెల్ పోలీసలు.. సంభాల్ లోని ఓ స్థావరంపై దాడి చేశారు. అప్పట్లో తృటిలో తప్పించుకున్న అతడు.. హైదరాబాద్ కు చేరుకున్నాడు. మారు పేరుతో సికింద్రాబాద్ లో దాదాపు ఆరు నెలలు ఉన్నాడు. ఇక్కడి నుంచి కేరళ వెళ్లిన రిజ్వాన్.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నాడు. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!