జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ గురించి.. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తునే ఉంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయినట్టు వార్తలు రాగా.. చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. షెడ్యూల్ మధ్యలో వచ్చే రెగ్యులర్ బ్రేక్ తప్ప.. అంతా పర్ఫెక్ట్గా సాగుతోందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ సినిమా విలన్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. తొలుత ఎన్టీఆర్కు ధీటుగా పవర్ఫుల్ నెగటివ్ రోల్ కోసం మలయాళ స్టార్ టోవినో థామస్ను అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకున్నారు.
Also Read : Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
దీంతో.. ఎన్టీఆర్ విలన్ ఎవరనే చర్చ జోరందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రక్రారం ఎన్టీఆర్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబందించి చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. తాజాగా టైగర్ ఫస్ట్ లుక్కు సంబంధించిన కొన్ని లీక్స్ అంచనాలు పీక్స్కు తీసుకెళ్లేలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త రగ్గడ్ ఊర మాస్ అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ లుక్ చూసిన అభిమానుల మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ తన హీరోలను ఎంత పవర్ఫుల్గా చూపిస్తారో మనకు తెలిసిందే. ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందని టాక్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
