‘KGF’, ‘సలార్’ సినిమాలతో డార్క్ విజువల్స్ అంటే ప్రశాంత్ నీల్.. ప్రశాంత్ నీల్ అంటే డార్క్ విజువల్స్ అన్నట్లుగా ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. అయితే ఎన్టీఆర్తో తీయబోయే సినిమా కోసం నీల్ తన పంథాను పూర్తిగా మార్చుకుంటున్నారట. ఇప్పటివరకు మనం చూసిన నీల్ సినిమాలకు భిన్నంగా, ఈ సినిమా చాలా కలర్ఫుల్గా, రిచ్ విజువల్స్తో ఉండబోతోందని సమాచారం.
Also Read : Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
ఎన్టీఆర్ తన తదుపరి షెడ్యూల్ను జోర్డాన్లో ప్రారంభించబోతున్నారు. దాదాపు 20 రోజుల పాటు జరిగే ఈ భారీ షెడ్యూల్లో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ ‘గ్రే అండ్ బ్లాక్’ షేడ్స్ను పక్కనపెట్టి, వైబ్రెంట్ కలర్ ప్యాలెట్ను వాడుతున్నారట. ఇది చూస్తుంటే ఎన్టీఆర్ను చాలా ఫ్రెష్గా, మునుపెన్నడూ చూడని రీతిలో చూపించబోతున్నారని అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అంతేకాకుండా, మలయాళ నటుడు టొవినో థామస్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. కథలో చిన్నపాటి మార్పుల వల్ల షూటింగ్ కొంచెం ఆలస్యమైనా, ఇప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్తో సినిమా పరుగులు పెడుతోంది. ప్రశాంత్ నీల్ కెరీర్లోనే ఇదొక విభిన్నమైన ప్రయత్నంగా నిలవబోతోంది.
