Site icon NTV Telugu

Video Viral: ఏ ఆటోనో, బస్సో కాదు.. ఏకంగా రైలునే నెడుతున్నారు.. వీడియో వైరల్..!

Train

Train

భారతీయ రైల్వే ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా చెబుతుంటారు. రైల్వే.. ప్రపంచంలోనే నాల్గవ-అతిపెద్ద నెట్‌వర్క్ గా ఉంది. ప్రతిరోజూ రైళ్లల్లో కోట్లాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఐతే ఇటీవలి వైరల్ వీడియోలో ఉపయోగంలో ఉన్న రైళ్ల పరిస్థితిపై సందేహాన్ని కలిగిస్తుంది. ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Virat Kohli: విరాట్ కోహ్లీని మళ్లీ టీమిండియాకు కెప్టెన్‌గా చేయొచ్చుగా..

మార్గమధ్యలో ఆగిపోయిన రైలును పలువురు అధికారులు మరియు ప్రయాణికులు నెట్టడం ఆ వీడియోలో కనపడుతుంది. లోకో పైలట్ రైలును ప్రారంభించడంలో ఆర్మీ జవాన్లు, పోలీసులు మరియు ప్రయాణికులు సహాయపడుతారు. ఈ ఘటన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రూట్‌లో జరిగింది. “రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో జవాన్లు మరియు ప్రయాణీకులు రైలును నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 70 ఏళ్లలో, ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?” అనే టెక్స్ట్‌తో ఈ వీడియో షేర్ చేశారు.

High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్‌ అధికారికి జైలు శిక్ష, జరిమానా

ఐతే ఈ ఘటనపై రైల్వే మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. రైలులో అగ్నిప్రమాదం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ట్వీట్‌లో తెలిపింది. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా.. ఇతర కోచ్‌లను వేరు చేయడానికి ఇంజిన్‌ను పంపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆర్మీ సిబ్బంది మరియు ఇతర అధికారులు ఇంజిన్ వచ్చే వరకు వేచి ఉండకుండా దానిని వేరు చేయడానికి నెట్టారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన 7 జూలై 2023న రైలు నం. 12703 (HWH-SC)న జరిగింది. రైల్వే సిబ్బంది మరియు స్థానిక పోలీసుల చర్య వెనుక కోచ్‌ల్లో మంటలు వ్యాపించకుండా ఉండటానికి సహాయపడిందని రైల్వే వెల్లడించింది. తక్షణమే స్పందించినందుకు అప్రమత్తమైన పోలీసు సిబ్బందికి మా కృతజ్ఞతలు అని రైల్వే ప్రతినిధి తెలిపారు.

https://twitter.com/B5001001101/status/1678258008512667648

 

Exit mobile version