IMD Warning: 123 ఇది రెండో సారి.. ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. భారత వాతావరణ శాఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే నెలలో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో సుమారు 8-11 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలలో 5-7 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సాధారణంగా., ఉత్తర మైదానాలు, మధ్య భారతదేశం, ద్వీపకల్ప భారతదేశంలోని పరిసర ప్రాంతాలు మే నెలలో మూడు రోజుల పాటు వేడిగాలులు వియబోతున్నాయి.
Also Read: WhatsApp: ఇకపై కొత్త ఖాతాల నుండి వాట్సప్ సందేశాలు రావా..?
Also Read
- Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య ద్వీపకల్ప భారతదేశంలోని పరిసర ప్రాంతాలు మినహా మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, భారతదేశంలోని ప్రక్కనే ఉన్న తూర్పు తీరాలలో ఉరుములు, మెరుపులు లేకపోవడం.. దిగువ స్థాయిలలో కొనసాగుతున్న యాంటిసైక్లోన్ కారణంగా ఏప్రిల్ లో తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంపై సుదీర్ఘమైన వేడిగాలులు సంభవించాయని మోహపాత్రా పేర్కొన్నారు. దీని కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో చాలా రోజుల పాటు సముద్రపు గాలి అంతరాయం కలిగించిందని ఆయన చెప్పారు.
Also Read: Bulls Fight: దుస్తుల దుకాణంలోకి దూరి రెచ్చిపోయిన ఎద్దులు.. చివరకి..
దక్షిణ ద్వీపకల్పంలో ఏప్రిల్ లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని., ఇది 1901 తర్వాత రెండో అత్యధికమని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత (22 డిగ్రీల సెల్సియస్) 1901 నుండి అత్యధికం అని వాతావరణ కార్యాలయం తెలిపింది. 1980ల నుంచి దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ చీఫ్ తెలిపారు. ఏప్రిల్ లో పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలలో అత్యధిక వేడిగాలుల రోజులు, ఒడిశాలో తొమ్మిదేళ్లలో అత్యధిక వేడిగాలుల రోజులు ఉన్నాయని ఆయన అన్నారు. ఒడిశా కూడా 2016 నుండి ఏప్రిల్ లో అతి వేడిగాలులను (16 రోజులు) ఎదుర్కొంది.
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?