IMD Warning: 123 ఇది రెండో సారి.. ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. భారత వాతావరణ శాఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మే నెలలో దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాలలో సుమారు 8-11 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర విలేకరుల సమావేశంలో తెలిపారు. రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, అంతర్గత ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలలో 5-7 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సాధారణంగా., ఉత్తర మైదానాలు, మధ్య భారతదేశం, ద్వీపకల్ప భారతదేశంలోని పరిసర ప్రాంతాలు మే నెలలో మూడు రోజుల పాటు వేడిగాలులు వియబోతున్నాయి.
Also Read: WhatsApp: ఇకపై కొత్త ఖాతాల నుండి వాట్సప్ సందేశాలు రావా..?
Also Read
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, వాయువ్య, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య ద్వీపకల్ప భారతదేశంలోని పరిసర ప్రాంతాలు మినహా మే నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, భారతదేశంలోని ప్రక్కనే ఉన్న తూర్పు తీరాలలో ఉరుములు, మెరుపులు లేకపోవడం.. దిగువ స్థాయిలలో కొనసాగుతున్న యాంటిసైక్లోన్ కారణంగా ఏప్రిల్ లో తూర్పు, దక్షిణ ద్వీపకల్ప భారతదేశంపై సుదీర్ఘమైన వేడిగాలులు సంభవించాయని మోహపాత్రా పేర్కొన్నారు. దీని కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో చాలా రోజుల పాటు సముద్రపు గాలి అంతరాయం కలిగించిందని ఆయన చెప్పారు.
Also Read: Bulls Fight: దుస్తుల దుకాణంలోకి దూరి రెచ్చిపోయిన ఎద్దులు.. చివరకి..
దక్షిణ ద్వీపకల్పంలో ఏప్రిల్ లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా నమోదైందని., ఇది 1901 తర్వాత రెండో అత్యధికమని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత (22 డిగ్రీల సెల్సియస్) 1901 నుండి అత్యధికం అని వాతావరణ కార్యాలయం తెలిపింది. 1980ల నుంచి దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐఎండీ చీఫ్ తెలిపారు. ఏప్రిల్ లో పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలలో అత్యధిక వేడిగాలుల రోజులు, ఒడిశాలో తొమ్మిదేళ్లలో అత్యధిక వేడిగాలుల రోజులు ఉన్నాయని ఆయన అన్నారు. ఒడిశా కూడా 2016 నుండి ఏప్రిల్ లో అతి వేడిగాలులను (16 రోజులు) ఎదుర్కొంది.
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!