North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సక్సెస్పుల్గా ముగిసింది. ఈ సమావేశంలో చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు వివిధ దేశాల నాయకులు ప్రసంగించారు. నాలుగు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా ఈ సమావేశంలో పాల్గొంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ వేదిక నుంచే.. ఆ దేశం అణు కార్యక్రమాన్ని ఇప్పుడు తమ సార్వభౌమాధికారంలో భాగమని ప్రత్యక్షంగా ప్రకటించింది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో నొక్కి చెప్పారు.
READ ALSO: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
అమెరికాకు గట్టి దెబ్బ..
నార్త్ కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ.. అణ్వాయుధాలను వదిలివేయాలని డిమాండ్ చేయడం తమ దేశ గుర్తింపు, రాజ్యాంగాన్ని తొలగించడంతో సమానమని పేర్కొన్నారు. నిరాయుధీకరణకు ఏవైనా షరతులు ఉంటే అది లొంగిపోవడమే అవుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ పదేపదే ఉత్తర కొరియా అణ్వాయుధీకరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా ప్రకటన అమెరికాపై ప్రత్యక్ష దాడి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ ఆయుధశాల ఇకపై ఎప్పటికీ బేరసారాల చిప్గా ఉండదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, అణ్వాయుధ నిరాయుధీకరణ, ఆంక్షల ఎత్తివేతపై మాత్రం ఇరుదేశాల ఒప్పందం విఫలమైంది. ఉత్తర కొరియా తన ప్రసంగంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను పెరుగుతున్న దురాక్రమణ ముప్పుగా విమర్శించింది. అందుకే కొరియా ద్వీపకల్పంలో అధికార సమతుల్యతను కొనసాగించడానికి అణ్వాయుధాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
దక్షిణ కొరియా స్పందన..
దక్షిణ కొరియా ప్రకారం.. ఉత్తర కొరియా ప్రస్తుతం నాలుగు యురేనియం సుసంపన్న కేంద్రాలను నిర్వహిస్తోంది. వాటిలో ప్రసిద్ధ యోంగ్బియోన్ కేంద్రం కూడా ఉంది. ఈ కేంద్రాల్లోని సెంట్రిఫ్యూజ్లు ప్రతిరోజూ పనిచేస్తున్నాయని అది పేర్కొంది. అందుకే దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ప్యోంగ్యాంగ్ అణు విస్తరణను ప్రాంతీయ ముప్పుగా భావిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా మాత్రమే కాదు ప్రపంచంలోని తొమ్మిది అణ్వాయుధ సంపన్న దేశాలైన అమెరికా, రష్యా, చైనా, భారత్, పాక్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు తమ అణ్వాయుధాలను వేగంగా ఆధునీకరిస్తున్నాయని పేర్కొన్నాయి.
READ ALSO: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
-
StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!