LPG Cylinder: ఎల్పీజీ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.. కేంద్రం భరోసా..
- కేంద్రం కీలక ప్రకటన..
- ఎల్పీజీ స్థిరంగానే ఉంది..
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ సరఫరా అత్యంత స్థిరంగా కొనసాగుతోందని.. వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
పెరిగిన ఉత్పత్తి..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశీయ రిఫైనరీల నుంచి గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా 38 శాతం మేర పెరిగింది. ఇది డిమాండ్కు అనుగుణంగా సరఫరాను నిరంతరం కొనసాగించడానికి దోహదపడుతోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 94 శాతం గ్యాస్ బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా.. వినియోగదారులకు సౌకర్యవంతంగా మారింది.
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
దుర్వినియోగానికి అడ్డుకట్ట..
సిలిండర్ల పక్కదారి మళ్లింపును (Black marketing) అరికట్టేందుకు ప్రభుత్వం ‘డెలివరీ ఆథెంటికేషన్ కోడ్’ (DAC) విధానాన్ని కఠినతరం చేసింది. ఈ విధానం వినియోగం ప్రస్తుతం 76 శాతానికి పెరిగింది. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) తప్పనిసరి చేయడం ద్వారా అసలైన లబ్ధిదారులకే గ్యాస్ అందుతోంది.
Also Read:North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో ఆ 0.07% వ్యతిరేకులు?
అక్రమాలను అరికట్టే క్రమంలో అధికారులు దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12,000కు పైగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 15,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
వినియోగదారులకు సూచనలు..
సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. గ్యాస్ సిలిండర్ల నిల్వ తగినంతగా ఉందని.. బుకింగ్ చేసుకున్న తక్కువ సమయంలోనే డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
తాజావార్తలు
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!