ITR Refund: లక్షల మంది అందని ఐటీఆర్ రీఫండ్.. ఆలస్యం అయితే ఫైన్ కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Refund: 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ జూలై 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గడువుకు ముందే చాలా మంది తమ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేశారు. ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన చాలా మందికి వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యింది. అయితే కొద్ది మందికి మాత్రం ఇంకా డబ్బు జమ కాలేదు. అయితే వారందరూ తమ ఖాతాలో మనీ ఎందుకు క్రెడిట్ కాలేదని ఆలోచిస్తున్నారు. దానికి కారణాన్ని ఆదాయపు పన్ను శాఖ ట్విటర్ ద్వారా తెలిపింది.
Also Read: ITR Refund: ఇన్ కమ్ ట్యాక్స్ రీఫండ్ ఇంకా క్రెడిట్ కాలేదా? అయితే ఇలా చెక్ చేసుకోండి
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ఆదాయపు పన్ను వెబ్సైట్ ప్రకారం, ఆగస్టు 23 వరకు 6.91 కోట్ల మందికి పైగా ప్రజలు ఐటీ రిటర్న్లు దాఖలు చేశారు. అయితే 6.59 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ల ధృవీకరణ చేపట్టారు. అయితే మిగిలిన 31 లక్షల మంది రిటర్న్లు ఇ-వెరిఫై చేయలేదు. దీంతో వారి రిటర్న్స్ ను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించలేకపోయింది. అందుకే వారి ఖాతాలో డబ్బులు జమకాలేదు. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, పన్ను చెల్లింపుదారులందరూ తమ ఐటీఆర్ ను ఫైల్ చేసిన తరువాత 30 రోజుల్లో దానిని ధృవీకరించడం తప్పనిసరి. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఇ-ఫైలింగ్ చేసిన తరువాత దానిని ధృవీకరించకపోతే, ఐటీఆర్ ప్రాసెస్ జరగదు. దీనికి సంబంధించే ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. ‘పన్ను చెల్లింపుదారులకు ధృవీకరణ కోసం 30 రోజుల సమయం ఉంది, ఇది త్వరలో ముగుస్తుంది. వీలైనంత త్వరగా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఈ లోపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయకపోతే మళ్లీ రిటర్న్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది’ అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఇక ఆలస్యరుసుము విషయానికి వస్తే వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు రూ. 1000 ఆలస్యరుసుముగా చెల్లించాలి.ఇక వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇ-వెరిఫికేషన్ ను మీ బ్యాంక్ ఖాతా నుంచి, ఆధార్ ఓటీపీ ద్వారా, మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!