Rajasthan: రాజస్థాన్ సీఎం కీలక నిర్ణయం.. మహిళలను వేధిస్తే ఇక ‘నో గవర్నమెంట్ జాబ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయవచ్చని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నొక్కి చెప్పారు. రాజస్థాన్ ఎన్నికలకు ముందు మహిళల భద్రతపై ముఖ్యమంత్రి కఠినమైన సందేశం ఇచ్చారు. సోమవారం శాంతిభద్రతల పరిస్థితిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారి రికార్డును ఉంచాలని పోలీసులను కోరారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడంతో సహా చర్యలు తీసుకోవచ్చన్నారు.
Also Read: Hanuman Chalisa: లోక్సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు
Also Read
- West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- US-Iran agreement: “చివరి దశలో అమెరికా-ఇరాన్ డీల్”.. ట్రంప్ కీలక ప్రకటన
- Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్కు హెచ్చరిక
రాజస్థాన్లో మహిళలను వేధించే పోకిరీలను సహించమన్నారు. మహిళలను వేధించే పోకిరీల పేర్లు నమోదు చేసుకుని స్టాఫ్ సెలక్షన్ బోర్డు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్తో పంచుకుంటామన్నారు. తద్వారా ఈ దరఖాస్తుదారులను ప్రభుత్వ సేవలకు దూరంగా ఉంచవచ్చన్నారు. వారి క్యారెక్టర్ సర్టిఫికేట్లలో వేధింపుల చర్య గురించి ప్రస్తావించబడుతుందని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనేక నేరాలపై బీజేపీ రాజస్థాన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రకటనతో ముఖ్యమంత్రి మహిళల భద్రతపై బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతున్నట్లు కనిపిస్తోంది. తన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై బీజేపీ చేసిన విమర్శలపై కేంద్ర ప్రభుత్వ సొంత డేటాతో ముఖ్యమంత్రి గత వారమే స్పందించారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో గణాంకాలను పేర్కొంటూ, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అత్యధిక అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. అస్సాం, ఢిల్లీ, హర్యానా మహిళలపై నేరాలలో అగ్రస్థానంలో ఉన్నాయన్నారు.
ఈ సమావేశంలో నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచే బార్లు, నైట్క్లబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించిన నిర్వాహకులు, యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు అటువంటి ఔట్లెట్ల లైసెన్సులను రద్దు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హోం శాఖ సహాయ మంత్రి రాజేంద్ర యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉషా శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (హోం) ఆనంద్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమేష్ మిశ్రా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
West Bengal Re-Poll: బెంగాల్ ఫల్తా ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం..
-
Mega Podcast: చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు.. త్వరలో ‘మెగా పోడ్కాస్ట్’లో!
-
Sachin Tendulkar: నిన్ను చూసి గర్వపడుతున్నాను.. అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్
-
Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
-
Mahela Jayawardene: 13 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లే.. బుమ్రా ఫెయిల్యూర్ వెనుక అసలు కారణం బయటపెట్టిన ముంబై కోచ్..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?