NTV Telugu Site icon

Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం..

Ayodhya

Ayodhya

Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఓ ఉదంతం వెలుగు చూసింది. నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవ (మతపరమైన చేతి దారం) ను కోసేసారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. విషయం తెలియగానే హిందువులు దీనిపై నిరసనకు దిగారు. అయితే., ఫ్యాక్టరీ భద్రతా అధికారి ఒక ప్రకటన విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.

Sanjay Kalvakuntla: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..

సెప్టెంబరు 21న ఈ సంఘ్తన జరిగింది. ఆ రోజు, ఉద్యోగులు ఫ్యాక్టరీ లోపలికి వెళుతున్నప్పుడు గేటు వద్ద ఉన్న గార్డు అందరి కాలవని కత్తిరించి లోపలికి వెళ్ళమని అడిగాడు. దీనిపై పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా రూపొందించి వైరల్‌గా మార్చారు. వివాదం ముదిరిపోవడంతో కంపెనీ సెక్యూరిటీ అధికారి సచ్చిదానంద్ తివారీ తప్పును అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కంపెనీ పాలసీ ప్రకారం.. బ్యాంగిల్స్, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, రిస్ట్ వాచీలు ధరించడం ప్రక్రియ ప్రాంతంలో అనుమతించబడదని చెప్పారు. ఎందుకంటే., ఈ వస్తువులు ప్రక్రియ ప్రాంతంలోకి వస్తాయి. అలా వచ్చినవి తయారు చేసే పానీయాన్ని కలుషితం చేస్తాయి. ఈ ఘటన జరిగిన రోజు కూడా సెక్యూరిటీ గార్డుకు ఈ సూచన రాగా.. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కాలవను కోసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.

Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్‌ రష్మి విజ్ఞప్తి!

ఈ ఘటనపై రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పెద్ద ప్రకటన చేస్తూ.. ఇలాంటి అవమానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. ఇది హిందూ సమాజాన్ని అవమానించడమే. కఠిన చర్యలు తీసుకోవాలని సాధు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని అయ్యన అన్నారు.