Nizamabad: నిజమాబాద్లోని నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో మొండెం లేని మహిళ మృతదేహం కలకలం సృష్టించింది. బాసర ప్రధాన రహదారి సమీపంలలో నగ్నంగా మహిళ మృతదేహం లభ్యమైంది. ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి అతి కిరాతకంగా హత్య చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డాగ్ స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీపీ సాయి చైతన్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది నెల వ్యవధిలో ఇద్దరు మహిళ హత్య కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Wanaparthy: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను మట్టుబెట్టిన భార్య..
