Nivetha Thomas: నేను ఏఐ బాధితురాలినే.. వాటిని షేర్ చేస్తే ఊరుకోను.. బయటకొచ్చిన మరో హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nivetha Thomas: నేటి సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంతటి విప్లవాత్మక మార్పులు తెస్తుందో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతోంది. తాజాగా సినీ తారల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు (Deepfakes) సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ శ్రీలీల ఈ అంశంపై స్పందించిన కొద్ది సేపటికే, మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు.
READ ALSO: Telangana Discom: మరో కొత్త డిస్కమ్కు ఆమోదం.. మార్గదర్శకాలు విడుదల
Also Read
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
నివేదా థామస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక తాజా ఫోటోను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏఐ పరిజ్ఞానంతో మార్చి (Morphed), అసభ్యకరంగా, తప్పుదోవ పట్టించే విధంగా సర్క్యులేట్ చేస్తున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను ఏఐ ద్వారా మార్చడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు, అది ఒక చట్టవిరుద్ధమైన చర్య అని ఆమె స్పష్టం చేశారు. ఇది తన గోప్యతకు (Privacy) భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరు పేరు లేని అనామక అకౌంట్ల వెనుక దాక్కుని ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారు వెంటనే ఆ కంటెంట్ను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇలాంటి నకిలీ చిత్రాలను షేర్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ చేయవద్దని ఆమె నెటిజన్లను కోరారు. అశ్లీలతను లేదా తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించడం కూడా నేరమేనని ఆమె గుర్తు చేశారు.
గతంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి నటీమణులు కూడా ఇటువంటి డీప్ఫేక్ (Deepfake) బాధితులుగా మారారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటీమణులు వరుసగా ఈ సమస్యపై గళమెత్తడం గమనార్హం. కేవలం సెలబ్రిటీలే కాదు, సాధారణ మహిళలు కూడా ఏఐ దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికతను సృజనాత్మకత కోసం వాడాలి తప్ప, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడకూడదనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది. నివేదా థామస్ చేసిన ఈ ధైర్యవంతమైన ప్రకటనకు సినీ వర్గాల నుండి మరియు అభిమానుల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
READ ALSO: The Rajasaab Premieres: ప్రభాస్ ‘రాజా సాబ్’ అప్డేట్.. ప్రీమియర్స్ ఎప్పుడో తెలుసా?
తాజావార్తలు
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
-
TG20 తొలి ఛాంపియన్గా ‘హైదరాబాద్ ఈ ఛాంపియన్స్’.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!