Nithya Menon: ‘ఇడ్లీ కొట్టు’ నడపబోతున్న ధనుష్- నిత్యామీనన్.. వైరల్ అవుతున్న పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు కేరళ కుట్టి అయినప్పటికీ ఈ బ్యూటీ డ్రెస్సింగ్ స్టైల్, మాటతీరు.. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటివరకు తను గ్లామర్ షో చేయలేదు. ‘వెల్లతూవల్, కేరళ కేఫ్ , ఏంజెల్ జాన్, అపూర్వరాగం, అన్వర్, అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, వెప్పం, ఐదోండ్ల అయిదు, మకరమంజు, ఇష్క్, తలసమయం ఓరు పెంకుట్టి, బ్యాచిలర్ పార్టీ, జబర్దస్త్ , గుండెజారి గల్లంతయ్యిందే, బెంగళూరు డేస్, రుద్రమదేవి, కాంచన 2, S/O సత్యమూర్తి, ఒక్క అమ్మాయి తప్ప, గీత గోవిందం, భీమ్లా నాయక్’ వంటి తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి మరెన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
Read Also: Raptee.HV T30: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కిమీ ప్రయాణం.. 8 సంవత్సరాల వారంటీ!
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆమె సినీ కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. చివరగా, 2022లో జవహర్ దర్శకత్వం వహించిన ‘తిరిచిరంబళం’ చిత్రంలో ధనుష్ సరసన నటిస్తుంది. ఇందులో ఆమె పాత్ర శోభన మరింత ట్రెండింగ్గా మారింది. ఈ చిత్రానికి గానూ నిత్యా మీనన్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. అలాగే ఇందులోని ‘మేగం కారుకథ’ పాటకు కూడా కొరియోగ్రఫీ జాతీయ అవార్డు వచ్చింది. ఈ సందర్భంలో ధనుష్కి జోడీగా నిత్యా మీనన్ ఓ చిత్రంలో నటిస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి కూడా ధనుష్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ధనుష్తో కలిసి నిత్యా మీనన్ మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Hyderabad Crime: హైదరాబాద్లో దారుణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఆటోలో సామూహిక అత్యాచారం
అయితే తాజాగా నిత్యా సోషల్ మీడియాలో ఓ చిత్రాన్ని పంచుకుంది. నిత్యా మీనన్, ధనుష్ టీ గ్లాసులను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని.. ‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ కడై’ అని క్యాప్షన్ జతచేసింది. కాగా ధనుష్, నిత్యా మీనన్ నటించబోయే చిత్రం పేరు ఇడ్లీ కొట్టు అని అర్థం అవుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఎంటంటే? విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఇడ్లీ కొట్టు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!