Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Nhai Increases Toll Fees On Expressways By 5percent Starting Monday

Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

Published Date :June 3, 2024 , 8:17 am
By Mahesh Jakki
Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Toll Fee: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అన్ని దశలు పూర్తయిన తర్వాత ఒక వైపు దేశం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఈరోజు నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. కాగా, కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీ ల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏడో విడత పోలింగ్ ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేస్తోంది.

Read Also: Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

కొత్త రేట్లు జూన్ 3, 2024 నుండి వర్తిస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ సీనియర్ అధికారి తెలిపారు. టోల్ ఫీజులను సవరించడం వార్షిక కసరత్తులో భాగమని, ఇది టోకు ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణంలో మార్పులతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. టోల్ రేట్లలో 3 నుండి 5 శాతం పెరుగుదల జూన్ 3, 2024 నుండి సోమవారం నుండి అమలులోకి వచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారి తెలిపారు. ఎన్నికల సమయంలో యూజర్ ఫీజు (టోల్) రేట్ల సవరణ వాయిదా వేశారని, అయితే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగిసినందున, ఈ రేట్లు జూన్ 3 నుండి అమల్లోకి వస్తాయని అధికారి తెలిపారు.

టోల్ ట్యాక్స్ అనేది కొన్ని ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ, రాష్ట్ర రహదారులను దాటేటప్పుడు డ్రైవర్లు చెల్లించాల్సిన రుసుము అని తెలిసిందే. ఇవి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పరిధిలోకి వస్తాయి. అయితే, ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరుగుతాయని, ప్రయాణికులపై భారం పడుతుందని ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు, పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.

Read Also: TG Polycet Results: నేడు పాలిసెట్ ఫ‌లితాల విడుద‌ల‌..

పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3వ తేదీ (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5లు, ఇరు వైపులా కలిపి రూ.10లు, చిన్నపాటి కమర్షియల్ వాహనా లు ఒక వైపు ప్రయాణానికి రూ.10లు, ఇరువైపులా కలిపి రూ.20లు, బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25లు, ఇరువైపులా కలిపి రూ.35లు, పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35లు, ఇరువైపులా కలిపి రూ.50ల వరకు పెంచారు. నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340లకు పెరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • National Highways Authority Of India
  • NHAI
  • NHAI increases toll fees
  • telugu news
  • toll charges

తాజావార్తలు

  • YS Jagan: ప్రజల తరఫున అనేక పోరాటాలు చేశాం.. గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్!

  • Fauji: నో డౌట్స్.. గట్టిగా ఫిక్స్ అయ్యారు!

  • YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్‌!

  • Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!

  • UstaadBhagatSingh : ఉస్తాద్ భగత్ సింగ్’ బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions