Love Affair: నవ వధువు పెళ్లైన మూడు నెలలకే.. భర్తకు మత్తు మందు ఇచ్చి.. ప్రియుడితో కలిసి..

  • నవ వధువు పెళ్లైన మూడు నెలలకే
  • భర్తకు మత్తు మందు ఇచ్చి
  • నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది
Love Affaire

Love Affaire

ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు ఎక్కువై పోయాయి. పెళ్లికి ముందే మరో వ్యక్తితో లవ్ ఎఫైర్ పెట్టుకుని.. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని ఆఖరికి అమాయకులైన భర్తలను కాటికి పంపిస్తున్నారు కొందరు భార్యలు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటనలో భర్త ప్రాణాలు తీయడానికి బదులుగా నగదు, బంగారం, వెండి తీసుకుని ప్రియుడితో కలిసి ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లైన మూడు నెలలకే వధువు బండారం బయటపడడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read:Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ కార్లకు రూ.38 లక్షల జరిమానా..!

ఝాన్సీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నవ వధువు, ఆమె ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహం అయిన మూడు నెలల తర్వాత, ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి, తన భర్తకు మత్తుమందు తినిపించి, స్పృహ కోల్పోయేలా చేసి, బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో ఇంట్లో నుంచి పారిపోయింది. సిటీ కొత్వాలి ప్రాంతంలోని నయా బస్తీలో నివసించే నావల్ కిషోర్ చిన్న కుమారుడు యశ్వంత్, పూంచ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అమరోఖ్ గ్రామానికి చెందిన రీనాను వివాహం చేసుకున్నాడు. మ్యారేజ్ జరిగిన మూడు నెలల తర్వాత, జూన్ 1న, రీనా మొదట తన భర్త యశ్వంత్ కు మత్తుమందు తినిపించి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత ఆమె తన ప్రేమికుడు రింకుతో కలిసి ఇంట్లో ఉంచిన నగలు, దాదాపు 50 వేల రూపాయలను తీసుకుని పారిపోయింది.

Also Read:Singareni BTPS : మణుగూరులో బూడిద వర్షం.. కాలుష్యంపై ప్రజల్లో ఆందోళనలు

తేరుకున్న భర్త, అతని కుటుంబ సభ్యులు నావల్ కిషోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్, ఆపై దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో, రీనా, రింకు ఇప్పటికే ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ అమరోఖ్ గ్రామ నివాసితులని తేలింది. పోలీసులు ఆ ప్రదేశాన్ని గుర్తించి సూరత్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేశారు. వారు ఎత్తుకెళ్లిన బంగారం, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీలసులు తెలిపారు.