Ahmadabad : గెలిచిన మూడో రోజే జంపింగ్ జపాంగ్.. ఆప్ నుంచి బీజేపీలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmadabad : గుజరాత్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలయింది. కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ రికార్డుస్థాయి మెజారిటీని సాధించింది. 156 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు 17 చోట్ల మాత్రమే గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఛైతర్ వసావ-దేడియాపాడా, భూపత్ భయానీ-విసావదార్, హేమంత్ ఖావా-జంజోధ్పూర్, ఉమేష్ మక్వాణా-బొటాడ్, సుధీర్ వాఘాని-గరియాధర్ ఉన్నారు.
Read Also: Crime News: కీచక ప్రిన్సిపల్.. టూర్లో స్టూడెంట్ తినే అన్నంలో మత్తు ఇచ్చి..
Also Read
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
కొత్తగా గెలిచిన ఐదుగురులో ఒకరు పార్టీ ఫిరాయించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. జునాగఢ్ జిల్లాలోని విసావదార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన భూపత్ భయానీ- బీజేపీలో చేరబోతోన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సమాచారం. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన భూపత్ భయానీ ఆ తరువాత బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. విసావదార్ స్థానం నుంచి గెలుపొందారు. ఫలితాలు వెలువడిన మూడో రోజే పార్టీని ఫిరాయించనున్నారు.
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..