IND vs NZ: టాస్ ఓడిపోవడం వల్లే గెలిచాం..- కివీస్ కెప్టెన్
- న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
- 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టులో విజయం
- న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు
- టాస్ ఓడిపోవడం వల్లే భారత్తో తొలి టెస్ట్లో విజయం సాధించాం- లాథమ్.
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్తో తొలి టెస్ట్లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
Also Read
నిజానికి వర్షం కారణంగా మ్యాచ్ తొలిరోజు ఒక్క బంతి కూడా పడలేదు. కాగా.. రెండో రోజు రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ‘ఈ మ్యాచ్లో మేం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టాం. తొలి రెండు ఇన్నింగ్స్లే మా విజయాన్ని ఖరారు చేశాయి. మూడో ఇన్నింగ్స్లో భారత్ కమ్ బ్యాక్ చేస్తుందని మాకు తెలుసు. కానీ రెండో కొత్త బంతితో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. సొంత గడ్డపై భారత జట్టు ఎంత క్వాలిటీ జట్టో మాకు తెలుసు. కొత్త బంతి మమ్మల్ని ఎలా దెబ్బతీసిందో భారత్ను కూడా అలా దెబ్బకొడుతుందని మేం అంచనా వేసాం. ‘ ముఖ్యంగా ఎనిమిదో వికెట్కు 137 పరుగులు జోడించిన రచిన్ రవీంద్ర (134), టిమ్ సౌథీ (65)లను లాథమ్ ప్రశంసించాడు. వారి భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. 100 పరుగుల లక్ష్యమే ఉండటం కూడా మేం స్వేచ్చగా ఆడేలా చేసింది.’ అని లాథమ్ తెలిపాడు.
Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..
విలియమ్ ఓ రూర్కీ అద్భుతంగా రాణించాడు. అతనికి పేస్, బౌన్స్, గాలిలో, వికెట్ వెలుపల బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అనుభవజ్ఞులైన సౌథీ, మాట్ హెన్రీ అతనికి సపోర్ట్ చేశారు. సౌదీ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. సౌథీకి బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు బాగా తెలుసు. కొన్నేళ్ల క్రితమే రచిన్ టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో రచిన్ 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడని లాథమ్ చెప్పుకొచ్చాడు. కాగా.. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది.
తాజావార్తలు
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
-
PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని
-
UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
-
Stock Market: మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!