IND vs NZ: టాస్ ఓడిపోవడం వల్లే గెలిచాం..- కివీస్ కెప్టెన్
- న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం
- 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టులో విజయం
- న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు
- టాస్ ఓడిపోవడం వల్లే భారత్తో తొలి టెస్ట్లో విజయం సాధించాం- లాథమ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్తో తొలి టెస్ట్లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..
Also Read
నిజానికి వర్షం కారణంగా మ్యాచ్ తొలిరోజు ఒక్క బంతి కూడా పడలేదు. కాగా.. రెండో రోజు రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఉంచింది. ‘ఈ మ్యాచ్లో మేం సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేసి ఫలితాన్ని రాబట్టాం. తొలి రెండు ఇన్నింగ్స్లే మా విజయాన్ని ఖరారు చేశాయి. మూడో ఇన్నింగ్స్లో భారత్ కమ్ బ్యాక్ చేస్తుందని మాకు తెలుసు. కానీ రెండో కొత్త బంతితో మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. సొంత గడ్డపై భారత జట్టు ఎంత క్వాలిటీ జట్టో మాకు తెలుసు. కొత్త బంతి మమ్మల్ని ఎలా దెబ్బతీసిందో భారత్ను కూడా అలా దెబ్బకొడుతుందని మేం అంచనా వేసాం. ‘ ముఖ్యంగా ఎనిమిదో వికెట్కు 137 పరుగులు జోడించిన రచిన్ రవీంద్ర (134), టిమ్ సౌథీ (65)లను లాథమ్ ప్రశంసించాడు. వారి భాగస్వామ్యం మా విజయానికి బాటలు వేసింది. 100 పరుగుల లక్ష్యమే ఉండటం కూడా మేం స్వేచ్చగా ఆడేలా చేసింది.’ అని లాథమ్ తెలిపాడు.
Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు..
విలియమ్ ఓ రూర్కీ అద్భుతంగా రాణించాడు. అతనికి పేస్, బౌన్స్, గాలిలో, వికెట్ వెలుపల బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. అనుభవజ్ఞులైన సౌథీ, మాట్ హెన్రీ అతనికి సపోర్ట్ చేశారు. సౌదీ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. సౌథీకి బ్యాటింగ్ సామర్థ్యం గురించి మాకు బాగా తెలుసు. కొన్నేళ్ల క్రితమే రచిన్ టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో రచిన్ 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడని లాథమ్ చెప్పుకొచ్చాడు. కాగా.. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ అక్టోబర్ 24 నుంచి పుణెలో జరగనుంది.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!