Duvvada Family Issue: మీడియా ముందు ఎమ్మెల్సీ దువ్వాడకు మాధురి ఫోన్.. ఇంటి రిజిస్ట్రేషన్పై క్లారిటీ
- మీడియా ముందు ఎమ్మెల్సీ దువ్వాడకు దివ్వల మాధురి ఫోన్
- ఇంటి రిజిస్ట్రేషన్పై క్లారిటీ ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Family Issue: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు రోజుకు మలుపులు తిరుగుతోంది. నేడు మీడియా ముందుకు వచ్చిన దివ్వల మాధురి.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఇంటి రిజిస్ట్రేషన్పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను రూ.2కోట్లు అప్పు ఉన్నానని.. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతికి రూ.60 లక్షలు ఇవ్వాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నా వ్యాపారాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తన ఆస్తిని మనస్పూర్తిగా మాధురికి రిజిస్ట్రేషన్ చేశానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ప్రెస్మీట్ పెట్టి చెబుతానన్నారు.
Read Also: ACA President: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవ ఎన్నిక
Also Read
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
తన ఆస్తిలోకి అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదని దివ్వల మాధురి వ్యాఖ్యానించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని అన్నారు. యాక్సిడెంట్ సమయంలో తన వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ను సృష్టించారని.. దువ్వాడ వాణినే ఈ వాయిస్ రికార్డు ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ దంపతుల మధ్య కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. శనివారం తనపై హత్యాయత్నం చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు దివ్వల మాధురి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు, ఈ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్కు అద్దెకు ఇస్తానన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి ,కుమార్తెలు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటిని ఖాళీ చేశారన్నారు. ప్రస్తుతం ఇంటిని స్వాధీన పరుచుకున్నానని దివ్వల మాధురి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..