New Liquor Brands : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు
- కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంపు
- మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి మార్చి 15 వరకు గడువు
- ఇప్పటి వరకు టీజీబీసీఎల్కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు
- ఏప్రిల్ 2వ తేదీ వరకు గడవు పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Liquor Brands : తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత మద్యం మార్కెట్లో నూతన బ్రాండ్ల ప్రవేశానికి అనుమతులు మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Prohibition & Excise Department) ఇప్పటికే కొత్త మద్యం బ్రాండ్ల రిజిస్ట్రేషన్కు దరఖాస్తుల ఆహ్వానం తెలిపింది.
ప్రారంభంలో కొత్త మద్యం బ్రాండ్ల దరఖాస్తుల సమర్పణకు మార్చి 15 వరకు గడువు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు దానిని ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ చెవ్వూరు హరి కిరణ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ మద్యం పంపిణీ సంస్థ (TGBCL)కి కొత్త మద్యం, బీరు బ్రాండ్ల సరఫరాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 39 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరిన్ని కంపెనీలు ఈ గడువు పొడిగింపును ఉపయోగించుకొని తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో మద్యం అమ్మకాల నియంత్రణ, నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేపట్టింది. కొత్త బ్రాండ్ల నమోదు ప్రక్రియను స్పష్టతతో రూపొందించడం ద్వారా మార్కెట్లో నకిలీ మద్యం విక్రయాలను అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లను రిజిస్టర్ చేసుకోవాలనుకునే కంపెనీలు ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ లేదా మానవీయంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అప్లికేషన్ సమర్పించవచ్చు. కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్ క్వాలిటీ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ వంటి కీలక సమాచారం అందించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాలి.
తెలంగాణలో ఉన్న మద్యం మార్కెట్ను మరింత పరిపాలించేలా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం. నాణ్యమైన మద్యం ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టడం.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం. దరఖాస్తుల సమీక్ష అనంతరం, అర్హత కలిగిన కంపెనీల బ్రాండ్లకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ప్రస్తుతానికి, కంపెనీలకు ఏప్రిల్ 2 వరకు సమయం ఇవ్వడం ద్వారా మరింత పోటీ పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!