Site icon NTV Telugu

Delhi: ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ

Whatsapp Image 2024 06 05 At 7.11.52 Pm

Whatsapp Image 2024 06 05 At 7.11.52 Pm

ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బలపరచగా.. కూటమి పక్ష నేతలంతా ఏకగ్రీవంగా మోడీని ఎంచుకున్నారు. మంగళవారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు. జూన్ 8న ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Rain Alert: రేపు, ఎల్లుండి ఏపీలో వర్షాలు.. ఉరుములు, మెరుపులతో పడే ఛాన్స్..!

ఎన్డీఏ కూటమిలో ఏపీ నుంచి తెలుగు దేశం అధినేత చంద్రబాబు, బీహార్‌లోని జేడీయూ అధినేత, సీఎం నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కు దాటలేకపోయింది. దీంతో ఎన్డీఏ పక్షాలే బీజేపీకి కీలకం కానున్నాయి. ఇక సమావేశానికి ఎన్డీఏ పక్షనేతలంతా హాజరై.. మోడీని ఎన్డీఏ పక్షనేతగా ఎన్నుకున్నారు.

Exit mobile version