NTV Telugu Site icon

Karnataka: ప్రియురాలిని కలేసేందుకు వచ్చిన నక్సలైట్.. పట్టుకున్న పోలీసులు.. కట్ చేస్తే..

Karnataka

Karnataka

కర్ణాటక రాజధాని బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి చెందిన ఏటీఎస్ బృందం హర్యానాకు చెందిన అనుమానిత నక్సలైట్‌ను అరెస్టు చేసింది. పట్టుబడిన నక్సలైట్ తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చాడు. అతడిని అనిరుధ్ రాజన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిరుధ్ నిషేధిత సీపీఐ(ఎం) నక్సలైట్ సంస్థలో ఉన్నాడు. నిషేధిత కథనాలను రాసి పోస్ట్ చేసేవాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, నక్సల్‌ వ్యతిరేక బృందం ఉచ్చు బిగించింది. బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది.

READ MORE: Bhatti Vikramarka: హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరిన డిప్యూటీ సీఎం..

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. అనిరుధ్ రాజన్ తన స్నేహితురాలిని కలవడానికి 3-4 రోజుల క్రితం బెంగళూరుకు వచ్చాడు. అతని వద్ద వికాస్ ఘడ్గే పేరుతో నకిలీ ఆధార్ కార్డు దొరికింది. చెన్నై వెళ్లేందుకు అనిరుధ్ గురువారం ఉదయం 8 గంటలకు కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఇదిలా ఉండగా అతడిపై నిఘా పెట్టిన ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. అనిరుధ్ రాజన్ డబ్బు వసూలు చేసి రహస్య సమావేశాలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

READ MORE:Bhatti Vikramarka: హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరిన డిప్యూటీ సీఎం..

యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు..
నిందితుడు అనిరుధ్ రాజన్ నుంచి 2 బ్యాగులు, పెన్ డ్రైవ్, ట్యాబ్‌లను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. అతడిపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసి ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని 15 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని పని కార్యకలాపాలపై విచారణ కొనసాగుతోంది.